ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది
అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటిబాట పట్టాల్సిందే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు మరింత జఠిలమవుతాయి., ఒకవేళ ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మ్యాచ్లలో 4 విజయాలతో 8 పాయింట్లతో పదో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ 4 లో కొనసాగుతుంది,హోరాహోరీగా సాగే ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరించనుందో చూడాలి, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ కు మొగ్గుచూపే అవకాశం ఉంది