“ముప్పయ్యేళ్ళుగా చంద్రబాబును గెలిపిస్తూనే ఉన్నారు” అని మొన్ననే సాక్షాత్తూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారే మీడియా సాక్షిగా కుప్పం ప్రజలను ఉద్దేశించి అన్నారు. మరి ముప్పయ్యేళ్ళుగా కుప్పం ప్రజల కోసం చంద్రబాబు ఏం చేసారు అని చూస్తే… కుప్పం కు కనీసం సరైన బస్టాండు కూడా లేని పరిస్థితి. జగన్ వచ్చాకే కుప్పంలో ఆకర్షణీయంగా బస్ కాంప్లెక్స్ ను నిర్మించారు. కుప్పంను మునిసిపాలిటీ చేశారు.
ఇప్పుడు మళ్ళీ జగన్ పూనుకుంటేనే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా శివారు ప్రాంతాల చిరకాల స్వప్నం ఫలించేలా హంద్రీ నీవా ప్రాజెక్ట్ కాలువ ద్వారా కృష్ణా నది నీళ్లు కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టబోన్నాయి. రూ.697 కోట్ల వ్యయంతో నిర్మించిన 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచి కాలువ ద్వారా 6,300 ఎకరాల భూములకు సాగునీరు, కుప్పం, పలమనేరు ప్రాంతాలకు చెందిన 2 లక్షల మందికి తాగునీరు అందనున్నాయి. ఈ నెల 26వ తేదీన కుప్పం బ్రాంచ్ కాలువలో నీటి విడుదల పనులను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఎన్టీ రామారావు ప్రభుత్వం లో శంకుస్థాపన జరిగిన హంద్రీనీవా ప్రాజెక్ట్ ని పట్టుదలతో పూర్తి చేయించిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వహయాంలో రాయలసీమ ప్రాంతంలోని మిట్ట ప్రాంతాలకు కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కనున్నాయి.
కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుపై అధిక్యతను సాధించడానికా అన్నట్టు… జగన్ మోహన్రెడ్డి ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన కుప్పం బ్రాంచ్ కాలువ పనులను పూర్తి చేయించారు. ఆ కోణంలోనే పలురకాలుగా ఆధిపత్యం సాధించడానికి ప్రణాళికా బద్ధంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పనులను చేయించడంలో ముందు నిలిచారు.
రూ.697 కోట్ల వ్యయంతో చేపట్టిన 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచి కాలువ పనులు ఇటీవలే పూర్తి అయ్యాయి. శంకర రాయల్ పేట కృష్ణాపురం, అరినేప ల్లి వద్ద నిర్మించిన మూడు లిఫ్ట్లతో, దాదాపు 30 కల్వర్టు బ్రిడ్జిలతో ఎత్తిపోతల పద్ధతితో కొనసాగే ఆ కాలువ కుప్పం, పలమనేరు నియోజకవర్గాల ప్రాం తాలకు చెందిన 6,300 ఎకరాల భూములకు సాగు నీరు అందిస్తుంది. 8 మండలాలకు చెందిన 2 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించనున్నది. భవిష్యత్తులో ఎగువ నుంచివచ్చే నీటి ప్రవాహం ఆధా రంగా దాదాపు వందకు పైగా చెరువులను నింపడానికి, భూగర్భ జలాలను పెంపొందించడానికి అవసరమైన రీతిలో ఆ కాలువ అనుబంధ విస్తరణ పనులు చేప ట్టాల్సి ఉంటుంది. అయితే పూర్తి అయిన కాలువ పనులకు సంబంధించి ఈ నెల 26వ తేదీన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి శాంతిపురం మండలం గుండుసెట్టి పల్లి వద్ద జలహారతి ఇచ్చి నీటిని లాంఛనంగా విడుదల చేయనున్నారు.