ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల తరువాత వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ప్రచారంను మేమంతా సిధ్ధం అనే పేరుతో ఇడుపుల పాయలో ఈరోజు ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ కు నివాళులు అర్పించి , అన్ని మతాల ప్రార్థలను పూర్తి చేసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను ప్రారంభించి సొంత నియోజవర్గం పులివెందుల నియోజవర్గం మీదుగా మహిళల హారతులు, అభిమానుల కేరింతలు మద్య కోలాహలాంగా ప్రొద్దుటూరుకు బయలుదేరారు. పులివెందుల నియజకవర్గం వేంపల్లె […]
వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను ఏ కార్యక్రమం తలపెట్టిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆశీస్సులు తీసుకొని మొదలుపెట్టడం పరిపాటిగా జరుగుతూనే ఉంది. గతం నుంచి చూస్తే 2017లో ప్రజసంకల్ప యాత్ర అక్కడ నుంచే మొదలుపెట్టడం, 2019 ఎన్నికల […]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ అధ్యక్షతన సిద్ధం సభలు సక్సెస్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇడుపులపాయ నుండి ప్రారంభమయ్యే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. ఇడుపులపాయకు చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. కాగా సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేన, […]
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈరోజు రేపో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటించుకుంటూ పోతున్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను రేపు ఇడుపులపాయ వేదికగా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్నారు. రేపు ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచే వైఎస్ఆర్సిపి అభ్యర్థులను […]
2024 సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల సమయం ఉన్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటనలతో వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేనల కూటమి తమ మొదటి విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించంగా, వైకాపా మాత్రం నియోజక వర్గాలలో నాయకుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ సమన్వయకర్తలును నియమించుకుంటూ వస్తోంది. ఈ రోజో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ అభ్యర్థుల ప్రకటనను ఈ నెల 16న ఇడుపులపాయలో […]