వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను ఏ కార్యక్రమం తలపెట్టిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆశీస్సులు తీసుకొని మొదలుపెట్టడం పరిపాటిగా జరుగుతూనే ఉంది. గతం నుంచి చూస్తే 2017లో ప్రజసంకల్ప యాత్ర అక్కడ నుంచే మొదలుపెట్టడం, 2019 ఎన్నికల ముందు అభ్యర్థుల ప్రకటన అక్కడ నుంచే చేయడం చూసాం.ఇటీవల 2024 ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన కూడా అక్కడ నుంచే చేయడం చూసాం, ఇంకా అదే విధంగా తన ఎన్నికల ప్రచారాన్ని మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ఇక్కడ నుంచే ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
మేమంతా సిద్ధం పేరుతో జరిగే ఈ బస్సు యాత్ర ఈ నెల 27న ప్రారంభమై రేపు నెల 22 వరకు జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ బస్సు యాత్రలో సిద్దం సభలు జరగని 21 పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో ఈ యాత్ర నిర్వహిస్తారు.ప్రతి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ బస్సు యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర సమయంలో ఒక నియోజక పరిధిలోని ప్రజలతో రోజు ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహిస్తారు, అదే రోజు సాయంత్రం భారీ బహిరంగ సభలో ఆ పార్లమెంట్ పరిధిలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గురించి సీఎం జగన్ వివరిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 21 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో 21 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు అని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇప్పటికే సిద్దం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా తన క్యాడర్ ను సిద్దం చేసుకున్నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారు అని సమాచారం ,దీనిపై వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.