2024 సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల సమయం ఉన్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటనలతో వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే టీడీపీజనసేనల కూటమి తమ మొదటి విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించంగా, వైకాపా మాత్రం నియోజక వర్గాలలో నాయకుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటూ సమన్వయకర్తలును నియమించుకుంటూ వస్తోంది. ఈ రోజో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ అభ్యర్థుల ప్రకటనను ఈ నెల 16న ఇడుపులపాయలో చేయనున్నట్టు వెల్లడించింది. సీఎం జగన్ తమ పార్టీకి చెందిన 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారు . 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇక్కడ నుంచే వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం అదే రోజు నుంచీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
2019 ఎన్నికలలో కూడా జగన్ తన ప్రచారాన్ని శ్రీకాకుళంలోనే మొదలు పెట్టాడు. ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచారం తర్వాత విజయవాడ పశ్చిమలో ఎన్నికల ప్రచారం , విజయవాడ పశ్చిమలో ప్రచారం ముగిసిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించి తాడేపల్లి నివాసానికి చేరుకుంటాడు. సిద్ధం సభలతో తన కార్యకర్తలను ఉత్తేజ పరిచిన జగన్ వెంట వెంటనే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలతో తన కార్యకర్తలను ఎన్నికల హడావిడిలోకి దించేశారని చెప్పవచ్చు . .