ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల తరువాత వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ప్రచారంను మేమంతా సిధ్ధం అనే పేరుతో ఇడుపుల పాయలో ఈరోజు ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ కు నివాళులు అర్పించి , అన్ని మతాల ప్రార్థలను పూర్తి చేసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను ప్రారంభించి సొంత నియోజవర్గం పులివెందుల నియోజవర్గం మీదుగా మహిళల హారతులు, అభిమానుల కేరింతలు మద్య కోలాహలాంగా ప్రొద్దుటూరుకు బయలుదేరారు.
పులివెందుల నియజకవర్గం వేంపల్లె మండలం లోకి అడుగు పెట్టగానే వేల మంది ప్రజలు హారతులతో, ముఖ్యంగా మహిళలు, యువత మేము సిధ్ధం అంటూ బస్సు వెంబడి పరుగులు పెడుతూ కన్పించారు. ఉప్పొంగిన జనసందోహం తో కూడిన ఆ దృశ్యాలు చూస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నేతగా చేసిన ప్రజా సంకల్ప యాత్రను గుర్తుకు తెచ్చిందని పలువురు సీనియర్ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్యహంగా పరుగులు పెడుతున్నారు.
ఎక్కడికక్కడ ప్రజలు అభివాదం చేస్తూ మండు వేసవిలో నుంచొని జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్నరు. ఇప్పటికి సభ కు జగన్ మోహన్ రెడ్డి చేరుకోవాలి కానీ ప్రజల అనూహ్య స్పందనతో రెండు గంటలు ఆలస్యంగా బస్సు యాత్ర నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా లో సాగుతున్న బస్సు యాత్ర భారీగా విజయవంతమైనట్లే. ఇక రేపటి నుండి నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ప్రజల స్పందనని చూడాలి. ఇప్పటివరకు అయితే బస్సు యాత్ర జగన్ పాదయాత్ర ను మించి జరుగుతుంది అనే అభిప్రాయాన్ని మీడియా ప్రతినిధులు వ్యక్త పరుస్తున్నారు.