సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిశనివారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. ఇడుపులపాయకు చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. కాగా సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రేపే ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతుండగా ఎన్నికల క్షేత్రంలో జగన్ మాత్రం ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. 2019లో చేసినట్లే ఈసారి కూడా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు జోష్లో ఉన్నాయి. మరోవైపు జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ రెడీ అయినట్లు తెలిసింది. ఈనెల 18వ తేదీ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో పర్యటిస్తారని తెలిసిది. మరికొద్దిరోజుల్లోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. రోజుకు రెండు నుంచి మూడు సభలు నిర్వహిస్తారని తెలిసింది. ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.