‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగింది. భవిష్యత్లోనూ జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి’ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీసీల సమస్యలపై 50 ఏళ్లుగా పోరాడుతున్నాం. సుమారు 12 వేల ఉద్యమాలకు నాయకత్వం వహించా. ఫలితంగా రెండు వేల జీఓ విడుదలయ్యాయి. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు.
ఇతర రాష్ట్రాలకు వెళితే తిరిగితే జగన్ విలువేంటో అందరికీ అర్థమవుతుంది. ఆయన పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అన్ని పార్టీలు బీసీలను తమ ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి. కేవలం జగన్ మాత్రం బీసీలను తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకున్నారు. ప్రజల అభివృద్ధే తన అభివృద్ధే అని భావించారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ను పేదలు దేవుడిలా ఆదరిస్తున్నారు. రెడ్డి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, సామాజిక సంస్కర్త. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సీఎంకు అండగా నిలవాలి. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు దేవినేని అవినాష్కు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని కోరారు. బీసీలంతా అవినాష్కు ఓటు చేస్తే అండగా ఉంటాడని పిలుపునిచ్చారు.