టీడీపీకి మొదటినుండి వెన్నుదన్నుగా ఉన్న బీసీ కులాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారిపోయింది. బీసీల తోకలు కత్తిరిస్తా అని బెదిరించడం బాబుకే చెల్లింది. తాజాగా 2024 ఎన్నికల సందర్భంగా మరోసారి బీసీలకు సీట్లు కేటాయించకుండా దగా చేసాడు చంద్రబాబు. ఓసారి టీడీపీ ఎంపీ సీట్లను పరిశీలిస్తే చంద్రబాబు బీసీలకు ఎంత అన్యాయం చేసాడో తేటతెల్లమవుతుంది.
వైజాగ్ ఎంపీగా భరత్, రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి, ఏలూరు ఎంపీగా మాగంటి బాబు, విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్, నరసావుపేట ఎంపీగా లావు కృష్ణ దేవరాయలను చంద్రబాబు ఖరారు చేసాడు. ఎస్సీ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలయిన అరకు,అమలాపురం, బాపట్ల, చిత్తూరు,తిరుపతి ఈ 5 నియోజకవర్గాలని మినహాయిస్తే రాష్ట్రంలో 20 నియోజకవర్గాలు మిగులుతాయి. వాటిలో ఒంగోలు, నెల్లూరు,కడప,నంద్యాల సీట్లు రెడ్లకి కేటాయించిన చంద్రబాబు కాకినాడ, మచిలీపట్నం సీట్లను కాపులకి ఇస్తున్నారు. విజయనగరం, నర్సాపురం సీట్లు రాజులకి ఇస్తుండగా రాజంపేట, హిందూపురంలో ఒక సీట్ రెడ్డి లేదా మరో ఓసికి ఇచ్చే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ జనాభా కేవలం 3%. కానీ తన సొంత సామాజిక వర్గం కావడంతో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన 20 నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గానికే సీట్లను కేటాయించిన చంద్రబాబు బీసీలకు టికెట్లు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసాడు. 50%కి పైగా జనాభా ఉన్న బీసీలకు కనీసం ఐదు సీట్లను కూడా ఇవ్వకపోవడం గమనిస్తే చంద్రబాబు బీసీలపై చూపించే కపట ప్రేమ అర్ధమవుతుంది. మరోవైపు బీసీలకు పెద్ద పీట వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించడం గమనార్హం. బీసీలు రాజకీయంగా ఎదగాలని సీట్ల కేటాయింపులో వారికి పెద్ద పీట వేస్తున్న సీఎం జగన్ కి కేవలం బీసీల ఓట్లను కొల్లగొడుతూ వారిని పైకి ఎదగనీయకుండా చేస్తున్న చంద్రబాబుకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.