కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమకు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని టీడీపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తలంచారు. కానీ ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు. అనంతరం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసాడు. అనంతరం ఉరవకొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాయలసీమను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని బీరాలు పలికాడు. కానీ శంకుస్థాపన మాత్రమే చేసి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం చంద్రబాబుకే చెల్లింది.
నిజంగా రాయలసీమని సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హంద్రీ నీవా సుజల స్రవంతిని పూర్తి చేసేవాడు. చివరకు 2005లో దివంగత మహానేత వైఎస్సార్ గారి హయాంలో హంద్రీ నీవా ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వైఎస్సార్ పూర్తి చేసిన హంద్రీ నీవా ప్రాజెక్టులకు శిలా ఫలకాలను వేసుకుంటూ కాలం గడిపిన చంద్రబాబు ఆఖరికి 14 సంవత్సరాలు సీఎం గా చేసి కూడా తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు నీళ్లు ఇవ్వలేకపోయాడు. సొంత ప్రాంతానికే నీరివ్వని చంద్రబాబు ఇప్పుడు వృద్ధనారి పతివ్రతలా నీ(తి)టి సూక్తులు వల్లించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
వాస్తవానికి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటిని రాయలసీమకు తరలించి తెలంగాణకు అన్యాయం చేసారని తాజాగా సీఎం జగన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి జగన్ 44000 క్యూసెక్కుల నుండి 89000 క్యూసెక్కులకి పెంచి రాయలసీమకు నీళ్లు తరలిస్తున్నాడని చంద్రబాబు అనుంగ శిష్యుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో గొంతు చించుకోవడం బాబుకు వినబడలేదేమో. ఆఖరికి చంద్రబాబు నిర్లక్ష్యంగా వదిలేసిన కుప్పానికి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి సీఎం జగన్ నీళ్లు ఇచ్చిన సంగతి ప్రజలు మర్చిపోరు.
రాయలసీమకు జగన్ ఏమి చేసాడు? నీళ్లు ఎవరు ఇచ్చారని కారుకూతలు కూస్తున్న బాబు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారని తన అనుంగ శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం చంద్రబాబుకు తెలియదేమో. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి సీఎం జగన్ నీళ్లు ఇచ్చిన సంగతి కుప్పం ప్రజలతో పాటు రాయలసీమ ప్రజలు మర్చిపోరు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని పాటు పడుతున్న సీఎం జగన్ ని అసలు నీరే ఇవ్వని ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని చంద్రబాబు ప్రశ్నించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.