2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ఆర్సిపి శ్రేణులు చంద్రబాబు ఓటమి కోసం సాయిశక్తుల పనిచేశాయి. మొదటినుంచి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తున్న మాట.. ఈ నేపథ్యంలోనే మొన్న మే 13న జరిగిన ఎన్నికల అనంతరం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడా..? అనే టెన్షన్ ఒక చంద్రబాబులోనే కాదు, టిడిపి శ్రేణులు కార్యకర్తల్లో కూడా బలంగా ఉంది. గత మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో
గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు వెన్నులో వణుకు మొదలైంది. అయితే బాబు బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా… లోలోపల మాత్రం ఓటమి భయంతో ఉన్నట్లు సమాచారం.
అయితే గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఏనాడు అభివృద్ధికి నోచుకోని కుప్పం నియోజకవర్గ అభివృద్ధి బాట పట్టింది. కుప్పాన్ని మున్సిపాలిటీ చేయడం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం అలాగే కుప్పం ప్రజల దశాబ్దాలు కలగా మిగిలిపోయిన నీటి కొరతను తీర్చడం కోసం యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలను అందించడం వంటి కార్యక్రమాల ద్వారా వైయస్ జగన్ కుప్పం ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. దానితోపాటు 2019 నుంచి కుప్పంలో సీఎం జగన్ అందించిన సంక్షేమం చేసిన అభివృద్దే చంద్రబాబు ఓటమి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి 1983లో చంద్రగిరిలో చంద్రబాబు ఓటమిపాలైన తరువాత.. 1989 నుంచి చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వస్తున్నాడు.. బీసీల నియోజకవర్గాన్ని కబ్జా చేసి.. తన మాటే వేదంగా శాసిస్తూ అభివృద్ధికి ఆమడదూరంలో పెట్టాడు కుప్పం నియోజకవర్గాన్ని పెట్టాడు బాబు..
అయితే కుప్పం నియోజకవర్గంలో వైయస్ జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఆ ప్రాంత ప్రజలకు వైయస్ జగన్ పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బలమైన నమ్మకం ఏర్పడిందనేది రాజకీయ శ్రేణులు చెబుతున్న మాట. ఆ క్రమంలోనే జరిగిన 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 89.88 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఎప్పుడూ లేనివిధంగా కుప్పంలో హరి పోలింగ్ నమోదు కావడం చంద్రబాబు ఓటమి భయానికి ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోను కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతోనే గెలుస్తూ వస్తున్నాడు అనేది ఆది నుంచి చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత కొన్ని ఎన్నికల నుండి దొంగ ఓట్లు తీసేయించడం వల్ల బాబు మెజార్టీ తగ్గుతూ వస్తుంది.
2014 నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గంలో చంద్రబాబు మెజారిటీని ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో 46 వేల మెజార్టీ రాగా అది 2019 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు మెజారిటీ 30వేలకు పడిపోయింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో దాదాపు 20 వేల పైచిలుకు దొంగ ఓట్లు గుర్తించినప్పటికీ, అందులో కేవలం 7 నుంచి 8000 దొంగ ఓట్లు మాత్రమే తీసేయగలిగారు. అయితే… తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీకి దొంగ ఓట్లు వేసే వారిని కొంత మేరకు కట్టడి చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ఏజెంట్లు సక్సెస్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది. తాను గెలిచే పరిస్థితి ఏ కోసానన్నా చంద్రబాబు అతి మామూలుగా ఉండదు కానీ ఓటమి ఖాయమని అర్థం అవడంతో ఎక్కడ ఎన్నికలు ఫలితాలపై మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు. ఈ ఎన్నికల్లో కుప్పం ఓటమి పాలవ్వడం ఖాయమని చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది.