తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకోవడం.. ఆ తర్వాత వారిని కరివేపాకులా తీసి పారేయడం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కొత్తేం కాదు. పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు సమయంలో దుగ్గుబాటి వెంకటేశ్వరరావును, నందమూరి ఫ్యామిలీని వాడుకున్నాడు. పదవుల విషయం వచ్చే సరికి వారిని దూరం పెట్టేశాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది బలిపశువులున్నారు. 2019 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడానికి బాబు అనేకమందిని వాడాడు. తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి వారిలో చాలామందికి టికెట్లు ఎగ్గొట్టి దటీజ్ చంద్రబాబని మరోసారి నిరూపించాడు.
దేవినేని ఉమా.. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఇతను నిద్ర లేచింది మొదలు జగన్ను తిట్టేవాడు. బాబుకు నేను ఎంత చెబితే అంత అనుకున్నాడు. కానీ మైలవరం టికెట్ను వసంత కృష్ణప్రసాద్కు ఇచ్చేశాడు టీడీపీ అధినేత. దీంతో ఉమా రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. ఇతని నోటికి అడ్డూ అదుపూ లేదు. మహిళలని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడేవాడు. చంద్రబాబు ఆపకుండా ఎంకరేజ్ చేయడంతో రెచ్చిపోయాడు. తీరా పెందుర్తి సీటును బాబు జనసేనకు ఇచ్చేశారు. పంచకర్ల రమేష్బాబు పోటీ చేస్తాడని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. ఇంకేముంది బాధ తట్టుకోలేక బండారు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.
పరిటాల శ్రీరామ్.. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఇతను చంద్రబాబు అండ చూసుకుని ఎగిరెగిరి పడ్డాడు. అరాచకాలు చేశాడు. ధర్మవరం టికెట్ తనదేనని రెచ్చిపోయాడు. చివరికి కుటుంబానికి ఒక టికెట్ అంటూ బాబు తోక కత్తిరించారు. వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వేమిరెడ్డి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చిన బాబు అనంతపురం జిల్లాను శాసించిన పరిటాల కుటుంబాన్ని మాత్రం ఒక స్థానానికే పరిమితం చేశారు.
చింతకాలయ విజయ్.. టీడీపీ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అధికార పార్టీని తిట్టాడు. మనుషులను పెట్టి మరీ తిట్టించాడు. వాళ్లంతా మహిళలను ఇబ్బందులు పెట్టారు. అయ్యన్న పాత్రుడి వారసుడైన విజయ్ జగన్ను అనరాని మాటలన్నారు. బాగా వాడేసిన బాబు ఎన్నికలు వచ్చేసరికి అనకాపల్లి ఎంపీ టికెట్ను ఎగ్గొట్టారు.
బుద్ధా వెంకన్న.. కాల్ మనీ సెక్స్ రాకెట్లో కీలక వ్యక్తిగా పేరుంది. చంద్రబాబుకు భక్తుడినంటూ ఇతర పార్టీలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారు. హద్దు మీరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాబు టికెట్ ఇచ్చి బాగా చూసుకుంటాడని అనుకున్నాడు. విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి ఎంపీ సీటు అడిగాడు. రక్తంతో లేఖ రాసినా ఉపయోగం లేకుండా పోయింది.
రఘురామకృష్ణరాజు.. వైఎస్సార్సీపీ ఈయన్ను ఎంపీని చేస్తే వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబుతో చేతులు కలిపాడు. ఎల్లో మీడియలో చేరి జగన్పై నోరు పారేసుకున్నారు. కానీ బాబు కనికరించలేదు. నరసాపురం స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. వాళ్లు రఘురామను లైట్ తీసుకుని శ్రీనివాసవర్మకు అవకాశం ఇచ్చారు. అందరికీ నారా వారు రాజకీయం అర్థమైనా ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారు.