జగన్ ప్రజల్లోకి వస్తే వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వైసీపీ కి అతిపెద్ద అసెట్. దానికి అనుగుణంగానే జగన్ సిద్దం సభల నుండి మొదలైన హంగామా, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఇంకెక్కువ ఉర్రూతలూగుతుంది. సర్వేలన్నీ వైసీపీ గెలుపును ఊహిస్తుండగా, జగన్ ప్రజల్లోకి రావడం తో మరింత పాజిటివ్ పవనాలు వైసీపీ వైపు వీస్తున్నాయి..
ఇక ప్రతిపక్షాల వైఖరి జగన్ నెత్తిన పాలుపోసినట్లు తయారు అయింది.. పబ్లిక్ మీటింగ్ లలో చంద్రబాబు చేసే వ్యాఖ్యలు టీడీపీ నాయకులకే తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈయన ఏం మాట్లాడుతున్నాడు రా బాబూ అని టీడీపీ నేతలే నెత్తి బాదుకుంటున్నారు. మొన్న శింగనమల లో మాట్లాడుతూ ఈ జగన్ ఓ టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే లను కూడా ఎడమ చేతితో వేలిముద్ర వేసే వాళ్లను చేస్తున్నారు, ఇదెక్కడి విడ్డూరం, రాజకీయాలను దిగజార్చారు అన్న చందాన మాట్లాడాడు. దీనితో అక్కడున్న టీడీపీ నేతలే అవాక్కయ్యారు. నాలుగు గోడల మధ్య తమ నాయకుల మధ్య వేసుకునే జోకులు బహిరంగంగా అనడం ఏమిటి అని ఆశ్చర్యపోవడం వారి వంతయింది… టిప్పర్ డ్రైవర్ కు, ఉపాది హామీ కూలీలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టడం గొప్ప విషయమే కదా అని జనాలు ఆలోచిస్తారు, దాన్ని హేళన చేయడం బాబు అసలు రూపం బయట పెట్టుకోవడమే.. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా బాబు గ్రాఫ్ పడిపోయింది…
ఇక నిన్న ఎన్నికల కమీషన్ అదేశాలతో టీడీపీ అదఃపాతాళానికి పోయే ప్రమాదం ఏర్పడింది. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా ఆదేశాలిమ్మని నిమ్మగడ్డ ఎన్నికల కమీషన్ ను కోరడంతో ఈసి ఆదేశాలిచ్చింది. నిమ్మగడ్డ రమేష్ ఎవరి ఆదేశాల మేరకు ఆ పని చేశాడు అని అడిగితే చిన్న పిల్లవాడి నుండి అయినా వచ్చే సమాధానం చంద్రబాబు..ఇక రానున్న రెండు నెలలు పెన్షన్ దారులైనా వృద్ధులు, వితంతువులు గతంలో లాగా కిలోమీటర్ల క్యూ లో నిల్చుని పెన్షన్ పొందాల్సిందే. గత ఐదేళ్లుగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్లు రేపు ఒకటో తారీఖు రాకపోతే ముసలి అవ్వా తాతలు బోసిపోతారు. దానికి కారణం చంద్రబాబు అని తెలిసాక వారి ఆగ్రహం పెల్లుబికుతుంది.. ఆ ప్రతాపం వారు ఓటు ద్వారా చూపిస్తారు…