పరిటాల సునీతకు తన కంచుకోట లాంటి రాప్తాడులో ఆదరణ కరువైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తన వెంట నడిచే నాయకులు, జెండా పట్టుకుని తిరిగే కార్యకర్తలు లేక అల్లాడిపోతున్న సునీత టీడీపీ వారికే మళ్ళీ టీడీపీ కండువాలు కప్పుతూ అభాసు పాలవతుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో తిరుగుతున్న సునీత తనకు కనపడిన ప్రతి మనిషికి అప్పటికప్పుడు టీడీపీ జెండా మెడలో వేస్తూ ఫొటోలు తీసి టీడీపీలో జాయిన్ అవుతున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత రాప్తాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ పని అయిపోయింది, ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యలేడు అంటూ డాంభికాలు పలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితులు పరిటాల సునీతకి ఏ మాత్రం అనుకూలంగా లేవు . పరిటాల కుటుంబం చేసిన మోసం వలనే తనకు ధర్మవరంలో బిజెపి టికెట్ దక్కలేదు అని రగిలిపోతున్న వరదాపురం […]
2019 ఎన్నికల్లో రాప్తాడు నుండీ పరిటాల సునీత ఓటమి తర్వాత ఆమె రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, తనయుడు పరిటాల శ్రీరామ్ ని మూడేళ్ళ క్రితం ధర్మవరం ఇంచార్జీ గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పటికే రాప్తాడు ఓడిపోయి ఉండటంతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ రోజు రోజుకీ మరింత బలపడుతుండడంతో ఇహ పై రాప్తాడులో రాజకీయం చేయటం కష్టమే అనుకొంటున్న పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇంచార్జి […]
అనంతపురం జిల్లా రాప్తాడు ఆదివారం జనసంద్రంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ ‘సిద్ధం’ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించింది. మిలియన్ క్యాడర్ మీట్గా అభివర్ణించింది. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలతో ఎన్నికల రణరంగంలో ముందున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సభతో హోరెత్తించింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు సభ విజువల్స్తో నిండిపోయాయి. […]