సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత రాప్తాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ పని అయిపోయింది, ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యలేడు అంటూ డాంభికాలు పలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితులు పరిటాల సునీతకి ఏ మాత్రం అనుకూలంగా లేవు . పరిటాల కుటుంబం చేసిన మోసం వలనే తనకు ధర్మవరంలో బిజెపి టికెట్ దక్కలేదు అని రగిలిపోతున్న వరదాపురం సూరి, నాకు టికెట్ దక్కనియ్యకుండా చేసిన పరిటాల సునీతను ఓడిస్తా అని శపథం చేసి రాప్తాడులో స్వతంత్ర అభ్యర్దిగా రంగంలోకి దిగుతున్నారు . ఇప్పటికే 2024లో రాప్తాడు లో గెలవలేము అని గత కొన్ని సంవత్సరాలుగా కేవలం ధర్మవరం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టీ అక్కడే ఎక్కువగా రాజకీయా కార్యకలాపాలు నిర్వహిస్తు వచ్చిన పరిటాల కుటుబం చంద్రబాబు ఇచ్చిన షాక్ తో తిరిగి రాప్తాడుకే పరిమితమయ్యారు.
ఇటు రాప్తాడులో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చొరవతో ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు టీడీపీ పార్టీకి రాజీనామాలు చేసి వైసీపీ లో జాయిన్ అయ్యారు. అలాగే ప్రజలు కూడా టీడీపీ హయంలో జరిగిన గొడవలు హత్యలతో విసిగి చెంది వైసీపీ కి జై కొట్టడం మొదలు పెట్టారు. ఇక ఈ ఐదు సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించి. వాటితో పాటు రోడ్లు, పేరూరు డ్యాం కు నీళ్ళు అందించడం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు ఛేజిక్కించుకొన్నాడు తోపుదుర్తి . ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సెకను రాప్తాడు ప్రకాష్ ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చారు. వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చెయ్యడంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అదే ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో తిరుగులేని ఆదరణను తీసుకువచ్చింది.
ఈ పరిస్థితులు చూసిన పరిటాల సునీత రాప్తాడులో తాను గెలవలేను అని నిర్ధారణకు వచ్చి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఎలా అయిన గెలవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా సొంత పార్టీ కార్యకర్తల నుండే సపోర్ట్ దొరకడం లేదు. వీటి మధ్యలో వరదాపురం సూరి కూడా పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా రాప్తాడులో పోటీ చెయ్యడం చూస్తుంటే పరిటాల సునీతనే నియోజకవర్గంను వదిలిపోయే రోజులు రానున్నాయి అని అనంతపురం జిల్లాలో పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు .