2019 ఎన్నికల్లో రాప్తాడు నుండీ పరిటాల సునీత ఓటమి తర్వాత ఆమె రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, తనయుడు పరిటాల శ్రీరామ్ ని మూడేళ్ళ క్రితం ధర్మవరం ఇంచార్జీ గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పటికే రాప్తాడు ఓడిపోయి ఉండటంతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ రోజు రోజుకీ మరింత బలపడుతుండడంతో ఇహ పై రాప్తాడులో రాజకీయం చేయటం కష్టమే అనుకొంటున్న పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇంచార్జి పదవి అప్పాజెప్పటం ఆయాచిత వరంలా కనపడింది.
దానితో రాప్తాడు నుండీ ధర్మవరానికి మకాం మార్చిన శ్రీరామ్ అక్కడి కార్యకర్తలను కలుపుకొని పోతూ స్థిరపడే ప్రయత్నం చేశాడు, దానితో పాటు టీడీపీ నిర్ధేశించిన కార్యక్రమాలకు, లోకేష్ నిర్వహించిన యువగళానికి చెప్పుకోదగ్గ స్థాయిలో జన సమీకరణ చేసి అధిష్టానం దృష్టిలో పడటానికి కృషి చేశాడు. అనుకొన్నవి అనుకొన్నట్టు జరిగితే అతను చంద్రబాబు ఎందుకు అవుతాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేల హటాత్తుగా పరిటాల కుటుంబం ఆశలు పెట్టుకొన్న ధర్మవరం టికెట్ పొత్తులో భాగంగా బిజెపికి ఇచ్చి, పరిటాల కుటుంబం పోటీకి భయపడుతున్న రాప్తాడునే వారికి అంటగట్టాడు.
దీనితో నివ్వెరపోయిన తల్లీ కొడుకులు “రాప్తాడులో మా పరిస్థితి బాగాలేదు కాబట్టి మా సర్వశక్తులు ధర్మవరంలోనే ఒడ్డాము, ఒక రకంగా రాప్తాడు కార్యకర్తలకు అన్యాయం చేశాము. ఆరోజు ధర్మవరం నుంచి ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పారు కాబట్టే ధర్మవరం వెళ్ళాం, మూడేళ్లు ఇబ్బందులు పడి కార్యకర్తలను కాపాడుకున్నాం..ధర్మవరం నుంచి వరదపురం సూరి పారిపోతే పరిటాల కుటుంబం అండగా ఉంటుందని భరోసా నింపాం..మాకంటే సూరికి కార్యకర్తలు ఉన్నారా?సత్య కుమార్ కు కార్యకర్తలు ఉన్నారా? ఏమి చూసి బీజేపీకి సీటు కేటాయించారు. వారి ఇద్దరికీ మేము ఏమి తీసి పోయాం.. పార్టీకి లాయల్ గా ఉండటమే మేము చేసిన తప్పా?
మేము మొన్న చంద్రబాబును కలిసి చెప్పాం రాప్తాడు అయిన వదులుకుంటాము, మాకు ధర్మవరం పోటీ చేసే అవకాశం ఇవ్వండని . ఇప్పుడు ధర్మవరం బీజేపీకి ఇస్తే రాప్తాడు లో ఏ మొహం పెట్టుకొని ప్రజలలో తిరుగుతాం, క్యాడర్ మమ్మల్ని ఎలా నమ్ముతుంది? మమ్మలని కావాలని అవమానించారు. అటు రాప్తాడుకి ఇటు ధర్మవరానికి రెంటికి చెడ్డ రేవడి అయ్యింది మా పరిస్థితి మీకో దండం బాబు రాప్తాడు టికెట్ మాకొద్దు అంటూ సన్నిహితుల దగ్గర సునీతమ్మ ఆవేదన చెందుతున్నారని సమాచారం .