రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్ చేపట్టిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర నేటి సాయంత్రం టెక్కలిలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. మార్చ్ 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారికి నివాళి అర్పించిన తరువాత ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర దాదాపుగా 22 రోజుల పాటు సాగింది. జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర వైసీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ ని నింపితే ప్రత్యర్ధుల్లో […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతోంది. నాలుగో రోజు తుగ్గలి, రాతన గ్రామాల ప్రజలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఆయా గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం వల్ల జరిగిన లబ్ధిని జగన్ వివరించారు. గ్రామాల్లోని రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 10 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో చూశారు. ఈరోజు మన ప్రభుత్వంలో ప్రస్ఫుటమైన మార్పులు ఈ కనిపిస్తున్నాయని సీఎం అన్నారు. తుగ్గలి గ్రామానికి సంబంధించి […]
ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల తరువాత వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ప్రచారంను మేమంతా సిధ్ధం అనే పేరుతో ఇడుపుల పాయలో ఈరోజు ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ కు నివాళులు అర్పించి , అన్ని మతాల ప్రార్థలను పూర్తి చేసుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను ప్రారంభించి సొంత నియోజవర్గం పులివెందుల నియోజవర్గం మీదుగా మహిళల హారతులు, అభిమానుల కేరింతలు మద్య కోలాహలాంగా ప్రొద్దుటూరుకు బయలుదేరారు. పులివెందుల నియజకవర్గం వేంపల్లె […]
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన శ్రేణులు.. అభిమానుల ఉత్సాహం నడుమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల రంగంలోకి దిగారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను బుధవారం వైఎస్సార్ జిల్లా నుంచి ప్రారంభించారు. తాడేపల్లి నివాసం నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్.. తల్లి విజయమ్మతో కలిసి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తల్లి నుంచి ఆశీస్సులు తీసుకుని వైఎస్సార్ ఘాట్ నుంచి రోడ్ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర […]
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో సీఎం జగన్ తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రజలతో మరింత మమేకం కావడానికి 21 రోజులపాటు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఒక పార్లమెంటరీ […]