2019 ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. అనేక సంస్కరణలతో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి బాటలు వేశారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మ మార్పులు తీసుకువచ్చి నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వబడుల రూపురేఖలు తీర్చిదిద్దారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే పాలను తీసుకువచ్చి లోకల్ గవర్నెన్స్ కి అర్థం చెప్పారు. ఇలా అనేక రకాలుగా సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను సౌకర్యాలను అందిస్తూ సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు.
అయితే సామాన్యుడు సంతోషంగా ఉంటే పెత్తందారుల మనసు ఊరుకుంటుందా? అక్కడే మొదలైంది అసలు అక్కసు… వైయస్ జగన్ ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకం పైన చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం పైన చంద్రబాబు తన ఎల్లో మీడియాతో, టీడీపీ అనుకూల అనుబంధ విభాగం ఐటీడీపీల ముసుగులో బురద చల్లడం మొదలుపెట్టారు. జనాలకు మేలు చేసే ప్రతి అంశం పైన తమదైన శైలి లో అసత్య ప్రచారాలకు ఆద్యం పోశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూపారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా 20 వేల కోట్ల విలువైన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సర్వ హక్కులు కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తే దానిపైన తమ అక్కసు వెళ్ళగక్కారు.
నిజానికి గతంలో పెత్తందారీ ప్రభుత్వాలు రెవెన్యూ రికార్డుల్లో చుక్క ఉంటే ఆ చుక్కల భూములను నిషేధిత భూములు జాబితాలో చేర్చి ఆ భూములు యజమానులకు చుక్కలు చూపించేవారు. ఆ క్రమంలోనే లక్షల ఎకరాల భూములను రకాల కారణాలు చెప్పి నిషేధిత జాబితాలో చేర్చి అధికారం రాగానే దోచుకుని దాచుకోవటానికి సర్వపన్నాగాలు పన్నారు. అయితే పేదల పక్షపాతి అయిన జగన్ అధికారంలోకి రావడంతో వారి ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. కొన్ని దశాబ్దాల తరబడి ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపి జగన్ పెత్తందారులకు అడ్డుకట్ట వేశాడు. దీనితో తమ భూదందాకు అక్రమార్జనకు అవినీతి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్న జగన్ పై ద్వేషాన్ని పెంచుకున్న పెత్తందారులు కక్ష కట్టారు. ఎలాగైనా వైయస్ జగన్ ని గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే పేదోడికి మేలు చేస్తున్న అంశం పైనా బురద జల్లుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ కడుపుమంటతో రగిలిపోతున్నారు.