టీడీపీ కి బాగా పట్టున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఆ పార్టీ కి రోజుకో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది, సీట్ల అడ్జస్ట్మెంట్, సీనియర్లకు టికెట్ల నిరాకరణ, నేతల బ్లాక్మైలింగ్ తదితర అంశాలతో రోజూ టీడీపీ కి ఏదో ఒక తలనొప్పి తయారు అవుతూనే ఉంది. తాజాగా పెనమలూరు టీడీపీ నేత చలసాని పండు కుమార్తె స్మిత టీడీపీ నాయకత్వం పై నిరసన వ్యక్తం చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు ..
పెనమలూరు నుండి బొడే ప్రసాద్ కి టీడీపీ నుండి టికెట్ కేటాయించారు.. మాకు ఎందుకు కేటాయించలేదు? ప్రతి సారి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది..2009 నుండి ఒక్క సారి అయినా సీటు ఇస్తే బాగుండేది. వెన్ను పోటు రాజకీయాలు టీడీపీ లోనే ఎందుకు ఉంటున్నాయి అర్దం కావటం లేదు అంటూ ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు..
అలాగే 2009 లో తన తండ్రి అయిన చలసాని పండు ఓడిపోవడానికి టీడీపీ పార్టీ నాయకులే కారణం అని, సొంత పార్టీ నాయకులే పండు ను ఓడించారనీ టీడీపీ పార్టీ లో జరిగే వెన్నుపోటు రాజకీయాల గురించి తమ అనుభవం చెప్పుకొచ్చారు.
పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు ఇప్పుడు ఏమయ్యారు? అని పరోక్షంగా బాబును ఆమె ప్రశ్నించారు..
పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తుంది అని తెల్సినా కుటుంబం అన్నాక చిన్న చిన్న తప్పులు తప్పవు లే, అలానే పార్టీ లో కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతాయని సర్ధుకుపోయామని చెప్పుకొచ్చారు..
తన తండ్రి చనిపోయాక కూడా పార్టీ కార్యకమాలు ఎన్నడూ ఆపలేదని, కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీ గెలుపు కోసం రోడ్ల మీద తిరిగి పని చేశామని, 2014 మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ ని భుజాన వేసుకుని ముందుకు నడిపాం అనీ అయినా గతం లో కూడా టీడీపీ టిక్కెట్లు ఇచ్చినప్పుడు మమల్ని సంప్రదించలేదని పార్టీ కోసం వారు పడిన కష్టాన్ని వివరించింది..
కాగా రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో పెనమలూరు సీటు తమకు ఇవ్వాలని పలు మార్లు కోరినా తమ విన్నపాన్ని పట్టించుకుండా, కనీసం ఐవీఆరెస్ సర్వే లో తమ పేరు ను కూడా చేర్చకుండా, ప్రజల మనోగతం కూడా తెలుసుకోకుండా తమకు అన్యాయం చేశారని, బోడే ప్రసాద్ బ్లాక్మైలింగ్ వల్లే ఆయనకు టికెట్ ఇచ్చారని, బ్లాక్మెయిల్ చేసే వారికున్న విలువ పార్టీకి, ప్రజాసేవకు అంకితమైన తమబోటి వారికి టీడీపీ లో విలువ లేదని ఆమె వాపోయారు…