నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం రేపు పుచ్చుకొనున్నారు. వైయస్సార్సీపీలో ఆరు సంవత్సరాలు తన రాజ్యసభ పదవీకాలం వినియోగించుకొని చివరి రెండు నెలలు ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తున్నాడు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా గతంలో వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది. వేమిరెడ్డితో పాటు అతను భార్య అయినా ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ కేటాయించాలని కోరగా అక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముస్లిం మైనారిటీకి చెందిన ఖలీల్ అహ్మద్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి టీటీడీ పాలకమండలి సభ్యురాలుగా తర్వాత టీటీడీ సలహా మండలి చైర్మన్ గా ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది వైసీపీ పార్టీ . ఇన్ని పదవులు అనుభవించాక కూడా వైఎస్సార్సీపీ పార్టీ కి తీరని ద్రోహం చేసాడు అనే చెప్పొచ్చు. వేమిరెడ్డితో పాటు రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అని సమాచారం.
ఒంగోలు నుంచి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఒంగోలు పార్లమెంట్ సీట్ వైఎస్సార్సీపీ నిరాకరించడంతో వైఎస్సార్సీపీనీ వీడునున్నట్లు తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన విడుదల అయినా తెల్సిందే . ఆ కారణం చేత వైఎస్సార్సీపీ ఎంపీ టికెట్ నిరాకరించింది . వైఎస్సార్సీపీలో టికెట్ రాని కారణం చేత తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఏమౌతోంది అని భావించి , టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తున్న దృష్ట్యా టీడీపీలోకి చేరుతున్నారు అని సమాచారం.
పల్నాడు జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో జాయిన్ అవుతున్నారు అని ప్రకటించారు. వైఎస్సార్సీపీ నర్సరావుపేట ఎంపీగా బీసీ లకు ఇవ్వాలి అని ఇక్కడ ఎంపీగా ఉన్న లావు కృష్ణ దేవరాయలును 2024 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీగా పోటీ చేయమని కోరింది. అక్కడ పోటీ చేయలేను అని చెప్పిన లావు, ఒకటి రెండు రోజులోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసుకున్నాడు. వైఎస్సార్సీపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన లావు ఏనాడూ పార్టీను ముందుకు తీసుకొని వెళ్ళింది, పార్టీ, ప్రభుత్వం చేసిన పనులను తనే సొంతగా చేసుకున్నట్లు ప్రచారం చేసుకున్నాడు, వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చి గెలిపించింది మాత్రం మరిచిపోయాడు . జంగా కృష్ణమూర్తికి వైఎస్సార్సీపీ తన సేవలు గుర్తుంచి ఎమ్మెల్సీ చేస్తే , ఎమ్మెల్సీ మాత్రమే ఇచ్చారు అధికారం ఇవ్వలేదు అని మీడియా ముందు గగ్గోలు పెట్టాడు. ఇంతకంటే ఎవరు గౌరవ ఇస్తారు. నరసరావుపేట యంపీగా పోటీ చేయమని కోరితే గురజాల ఎమ్మెల్యే టికెట్ కావాలని మొరాయించి టీడీపీలోకి రంగప్రవేశం చేస్తున్నాడు . ఇలా వైసీపీ టికెట్ నిరాకరించిన వారు అందరిని తీసుకోని ఏం చేస్తుందో టీడీపీ .