జరిగేది ఒకటి.. ఎల్లో మీడియా చూపించేంది మరొకటి. చంద్రబాబు ఆయన కార్యకర్తల వల్లే కింద పడబోతే ఇది సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఫల్యమంటూ చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం రా కదలి రా సభ జరిగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబుకు రాజానగరం టికెట్ కేటాయింపు విషయమై తమ నేతల నుంచే తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. దీనికి కారణం లేకపోలేదు. బాబు జనసేనను పట్టించుకోకుండా ఓ సభలో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందుకు పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో తమ పార్టీ చేస్తుందని చెప్పారు. దీనిపై ఇరు పార్టీల్లోని ఆశావహుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మాటల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాతేరులో జరిగిన సభలో రాజానగరం టికెట్ విషయమై బాబుకు అసంతృప్తి సెగలు తగిలాయి. జనసేనకు కేటాయించడంపై బాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. దీంతో తమ పార్టీ కార్యకర్తలపైనే అధినేతకు కోపమొచ్చింది. ఒకనొక సందర్భంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్టేజ్ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా బాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ పట్టుకున్నారు. తోపులాటపై బాబు సీరియస్ అయ్యారు. ఇదేం తీరు తమ్ముళ్లూ.. అంటూ అసహనం ప్రదర్శించారు. అయితే ఈ సంఘటనను ఎల్లో మీడియా మరోలా చూపించింది. బాబు సభలో పోలీసుల సెక్యూరిటీ వైఫల్యం జరిగిందని, అందుకే ఆయన కింద పడబోయారని ఆయా ఛానల్స్లో వచ్చింది. సొంత పార్టీ నేతలు ఇలా చేస్తే ఇందులో ప్రభుత్వాం ఏం సంబంధం ఉందో.. డియర్ ఎల్లో మీడియా.. మీరు మారరా..