ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొదలవ్వగానే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రచారం శృతిమించి సొంత పార్టీనే భూస్థాపితం చేసే విధంగా మారుతున్నాయి. మొదట శింగనమలలో టిప్పర్ డ్రైవర్లు వైసీపీ పార్టీ అభ్యర్ధులు అంటూ అవహేళనగా మాట్లాడాడు, తరువాత వాలంటీర్ల మీద మాటలతో మానసికంగా దాడులు చేసి హింసించడం మొదలుపెట్టారు అంతటితో ఆగకుండా ఫించన్ దారులకు వాలంటీర్ల ద్వారా ఫించన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేపించి అడ్డుకున్నారు. దీని వలన రాష్ట్రంలో 39 మంది వృద్ధులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకునే ఆర్య వైశ్యులు గంజాయి అమ్ముతున్నారు అని మాట్లాడి అ వర్గాలను కించ పరిచేలా మాట్లాడారు. దీంతో అ వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి మాటలకు తమ నిరసన వ్యక్తం చేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజు ప్రతి చోట చంద్రబాబు నాయుడు తన నోటి దురుసు తో టీడీపీ పార్టీకి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఇంకో వైపు నారా లోకేష్ అధికారులను ఎర్రబుక్కు అనే పేరుతో బెదిరించడంతో ప్రభుత్వ అధికారులు టీడీపీ మీద రగిలిపోతూ ఉన్నారు. మరొక వైపు పురంధేశ్వరిని అడ్డుపెట్టుకొని కొంత మంది ఐపిఎస్, ఐఎఎస్ అధికారుల మీద అధికార పార్టీకి అండగా పని చేస్తున్నారు అని కేంద్రం ఎన్నికల సంఘంకు ఫిర్యాదులు చేపించి వారిని ఎన్నికల విధులకు దూరంగా వుంచడం మళ్ళీ తమ అను’ కుల ‘ మీడియా లో ఐపిఎస్, ఐఎఎస్ అధికారుల మీద వికృత పోకడలతో ప్రతి రోజు వ్యతిరేక వార్తలు వ్రాయించడం, డైరెక్ట్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డిజిపి మీద వ్యతిరేకంగా వార్తలు వ్రాయించడంతో వారు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు వాటి మీద ఎన్నికల సంఘం తొందర్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పోలిస్ ఆఫీసర్ సంఘం ఇప్పటికే టీడీపీ కి , పచ్చ మీడియా కు తమ మీద వ్రాసిన తప్పుడు వార్తలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే లీగల్ నోటీసులు ఇస్తాము అని ప్రకటించారు.
రాష్ట్రంలో ఇప్పటికే వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీని ఓడించి తీరుతాం అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. మమల్ని కించ పరిచేలా మాట్లాడిన చంద్రబాబు నాయుడ్ని ఓడించడమే మా ధ్యేయం అని కుప్పంలో 384 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అలాగే వృద్దులు చంద్రబాబు వలనే తమకు ఫించన్లు ఇంటింటికీ రాలేదు అని 66 లక్షల ఫించన్ దారులు చంద్రబాబు నాయుడు, టీడీపీ మీద రగిలిపోతూ ప్రచారానికి వస్తే తరిమి కొడుతున్నారు. అటూ అధికారుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం మొదలైంది.ఇప్పుడు గ్రామాల్లో బలమైన వ్యాపార వర్గమైన ఆర్య వైశ్యులను గంజాయి అమ్ముతున్నారు అంటూ మాట్లాడి పార్టీ కి తొలి నుండి అండగా వుంటున్న ఆర్య వైశ్యులను పార్టీకి దూరం చేసి టీడీపీ ఓటమికి పని చేసేలా చేశారు.
ఇవన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు వయస్సు పెరిగి చాదస్తంతో ఇష్టరీతిలో మాట్లాడుతున్నారు. దీనితో అటూ పార్టీకి కూటమికి ముఖ్యంగా చంద్రబాబు ఓటమికి ఈ పరిస్థితులు దారితీస్తున్నాయి అని తెలుస్తుంది.