2014లో ఏపీ ,తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం అర్ధికలోటు, అభివృద్దిలేమితో సీమాంద్ర ఉత్తరాంద్ర ప్రాంతాలుగా మిగిలిన అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టిస్తాం అనే నినాదంతో ముఖ్యమంత్రిగా కుర్చి ఎక్కిన చంద్రబాబు ఆదిశగా అడుగులు వేయకుండా కేవలం అమరావతి ప్రాంతం చుట్టూ రాజకీయం, వ్యాపారం, అవినీతి చేస్తూ ప్రజలని మభ్యపెడుతూ వచ్చారు. ఈ కారణంతోనే ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీకీ గతంలో ఎన్నడూ లేని దారుణమైన ఓటమిని ఆ పార్టీకి రుచి చూపించారు.
ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలని నెరవేర్చడమే తన ప్రధాన ఎజండాగా సంక్షేమ పధకాలపై ఫోకస్ పెట్టి ఇచ్చిన మాటని నెరవేరుస్తూ 98% హామీలను అమలు చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ మరోకటి లేకపోవడంతో జగన్ గారికి సంక్షేమ రధసారధిగా పేరు వచ్చింది. ప్రజలకు నేరుగా డబ్బులు చేరడంతో ప్రతిపక్షాలు సైతం దీనిని కాదనలేక పోయింది. పైగా ఇలా డబ్బులు పంచితే రాష్ట్రం దివాలా తీస్తుంది అంటూ అర్ధంలేని ఆరోపణలు చేస్తూ కాలం వెల్లబుచ్చింది. అయితే ప్రజల చేతికి డబ్బులు ఇవ్వడం ఉచితాలు కాదని అవి కనీస అవసరాలని పేదలకు పౌష్టిక ఆహారం , హెల్త్ కేర్, నివాసం, విద్యా అలాగే వారి ఆర్ధిక స్వావలంబనకి ఇచ్చే నగదు ఉచిత తాయిలాలుగా పరిగణిచకూడదని అలాంటి కనీస అవసరాలు తీరిస్తేనే పేదరికం పోయి దేశం అభివృద్ది బాటలో పయనిస్తుందని ప్రముఖ ఆర్ధిక వేత్త జయతీ ఘోష్ , బెనర్జీ లాంటి వారు చెప్పడంతో ఆ ప్రచారం మానుకున్నారు.
పేదలకు అందిస్తున్న సంక్షేమం పై నిరంతరం విమర్శలు చేస్తూ ప్రజ్లల్లో మరింత పలుచనైన తెలుగుదేశం రూటు మార్చి జగన్ సంక్షేమం పై మాత్రమే ఫోకస్ చేసి రాష్ట్రంలో అభివృద్దిని పూర్తిగా విస్మరించారని, దీంతో రాష్ట్రం 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని సరికొత్త ప్రచారం అందుకుని అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి తాను అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ది చేసి చూపిస్తా అంటూ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 5ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏపీకి చేసిన మేలేంటని చెప్పుకోలేని ఆ పార్టీ చంద్రబాబు మళ్ళి వస్తే మేలు జరుగుతుందని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం.
నిజంగా టీడీపీ అనుకూల ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతునట్టు జగన్ గారి పాలనలో సంక్షేమం మాత్రమే జరుగుతూ అభివృద్దిని పూర్తిగా విశ్మరించారా అని చూస్తే టీడీపీ చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం బయట పడుతుంది. చంద్రబాబు 5ఏళ్ళ పాలనలో జరగని అభివృద్ది జగన్ చేసి చూపించారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతుంది. తెలుగుదేశం పరిభాషలో అభివృద్ది అంటే ఐటీ కంపెనీలు మాత్రమే. కానీ ప్రజలు కోరుకుంటున్న అభివృది చూస్తే ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, MSME లు, పెట్రోలియం, ఫెర్టిలైజర్స్, ఎలక్ట్రానిక్ తయారీ రంగం, టెక్స్టైల్, పోర్టులు, హార్బర్, ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసిన గ్రామ సచివాలయాలు, రైతులకి ఉపయోగపడే ఆర్బీకెలు, నాడు నేడు బడులు , హెల్త్ సెక్టార్ విలేజ్ క్లినిక్, మెడికల్ కాలేజీలు. ఇలా అన్ని రంగాలు కలిసి వెళితేనే అభివృద్దని, అది జగన్ గారి పాలనలో పూర్తిస్థాయిలో జరుగుతుందని ప్రజల నుండి వస్తున్న మాట.
అలాగే జగన్ గారు వచ్చాక టెక్ బుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, రాండ్ స్టాండ్ ఐటీ కంపెనీ, ఇన్-ఫోసిస్ , ఎక్స్.టీ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్, ఐ-జెన్ అమెరికా సాఫ్ట్వేర్స్, డబిల్యూ.ఎన్.ఎస్ లాంటి ఐటీ కంపెనీలు వచ్చాయని, చంద్రబాబు ఏం కంపెనీలు తెచ్చాడని సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుండి టీడీపీకి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ కారణంతోనే ఎస్టీపీఐ గణాంకాల ప్రకారం చంద్రబాబు పాలనలో ఐటి ఎగుమతులు ఆయన దిగిపోయే సమయానికి 2018-19లో 986 కోట్లు కాగా, ఇప్పుడు జగన్ గారి పాలనలో 2022-23లో 1,867 కోట్లుగా ఉందని ఐటీ ఉద్యోగులు చెబుతున్న లెక్క .
అలాగే నీతి అయోగ్ ఆంధ్రప్రదేశ్ లో పేదరికం తగ్గిందని ఇచ్చిన రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థుల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరిగిందని ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్. దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రాజెక్ట్స్ టుడే సర్వే ఇచ్చిన రిపోర్ట్. ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా పెట్టుబడులను వాస్తవరూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇచ్చిన రిపోర్ట్ చూపిస్తూ అసలు జగన్ గారిపై ప్రచారం చేస్తున్న టీడీపీకి అభివృద్ధి అంటే ఏంటో తెలుసా అంటూ ఎదురు ప్రశ్న ప్రజల నుండే రావడం గమనార్హం.