వాలంటీర్ల వలన జగన్ కు మంచి మైలేజ్ వస్తున్నదని మొదటి నుండి వారి పై ఏదో విధంగా కక్ష గట్టి, నీలాపనిందలు, అవమానాలకు గురి చేసిన టీడీపీ, వారి వారి విధుల నుండి వారిని దూరం చేయాలని చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.. కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు ఇంటినికి పెన్షన్ పంపిణీ చేస్తే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ప్రజలకు ఎన్నికల ముందు మళ్లీ గుర్తు చేసినట్లు అవుతుందని భావించిన బాబు, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకుండా ఎన్నికల కమీషన్ ఆదేశించాలని ఈసి ని కొరగా తదనుగుణంగా ఈసి ఆదేశాలిచ్చింది…
ఇది తమ విజయం అని చంకలు గుద్దుకున్న టీడీపీ కి ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేకపోయింది. సరిగ్గా 1 వ తారీఖు ముందే ఈసి ఈ అదేశాలు ఇవ్వడం తో ఒకటవ తారీఖు తెల్లారగానే ఇంటి ముందుకే వచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్ రాక అవ్వా, తాతలు ఆశ్చర్యపోయారు. ఐదేళ్లుగా ఠంచనుగా ఇంటికి వచ్చే తమ చేతికి నగదు అందించే వాలంటీర్ ఈరోజు ఎందుకు రాలేదని వారు అడగ్గా, చంద్రబాబు వాలంటీర్లని పని చేయనీకుండా అడ్డుపడ్డాడని స్థానిక ప్రజానీకం చెప్పుకోవడంతో బాబు ని బండబూతులు తిట్టడం రాష్ట్రవ్యాప్తంగా జరిగిపోయింది…
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తాము చేసిన పని వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావడం అటుంచితే ఇంకాస్త పెరిగింది, బాబు అండ్ కో ఇమేజ్ అదః పాతాళానికి వెళ్లింది.. డ్యామేజ్ కంట్రాక్ లో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల కనీషనర్ ను కలిసి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే మాకెలాంటి ఇబ్బంది లేదని లెటర్ ఇస్తూ, అదే లెటర్ లోనే పెన్షన్ ఇంటికే పంపిణీ చేయడానికి అధికారులను వాడుకోవాలని సూచించారు..
వాలంటీర్లు అంటే అదే ఊరి వ్యక్తి, అదే ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తి కాబట్టి ఎవరి ఇల్లు ఏది? ఎవరికి పెన్షన్ ఇవ్వలనే అవగాహన ఉంటుంది. కానీ అధికారులకు అలాంటి సమాచారం ఇప్పటికిప్పుడు దొరకడం అసాధ్యం. కాబట్టి లబ్ధిదారులే సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ పొందాల్సిందే.. ఎండాకాలం లో వయసైపోయిన అవ్వా తాతలనా ఇంత ఇబ్బందికి గురి చేసిన బాబు అండ్ కో రాక్షస ఆనందం పొందుతున్నారు..