పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైకో సేన ఆర్తనాదాలు మిన్నంటాయి. దీంతో కొందరు సేనాని అభిమానులు ఫేక్ పోస్టులకు తెరతీశారు. ఇదంతా ఆయన అన్న నాగబాబు డైరెక్షన్లో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఆదిలోనే టీడీపీ ఇన్చార్జి వర్మ, ఆయన వర్గం నుంచి వ్యతిరేకత రాగా డబ్బుతో నోళ్లు మూయించాడు సేనాని. అయితే గీతకు ప్రజాబలం ఉండడంతోపాటు స్థానికత అంశం కలిసొచ్చింది. దీంతో పవన్ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నాడు. కాగా వాటిపై గీత ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు.
పవన్ గ్యాంగ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా గీతను మానసికంగా దెబ్బ తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నాగబాబు ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజీలకు ఆర్థిక వనరులు సమకూర్చి దుష్ప్రచారం చేయించడం ప్రారంభించాడు. ‘నువ్వు మా ఆడపడుచువి. నా తమ్ముడు కూడా నిన్ను ఎంతో గౌరవిస్తాడు. అతని చేతిలో నువ్వు ఓడిపోవడం మాకు చాలా అవమానమని వంగా గీతకు చిరంజీవి చెప్పడంతో ఆమె వెనక్కు వెళ్లలేను అన్నయ్య, కానీ పవన్ గెలుపు కోసం పనిచేస్తా’ అని చెప్పిందంటూ పోస్టులు వేశారు. మరో దాంట్లో పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి గీత తన నామినేషన్ వెనక్కి తీసుకోనుందని పోస్టు చేశారు. ఇప్పుడు ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ఆమె నామినేషన్ ఓకే అయ్యి గుర్తు కేటాయింపు కూడా జరిగింది. దీంతో సైకో సేన ముఖచిత్రం ఏమిటో..
మహిళను ఎదుర్కోలేక పవన్ గ్యాంగ్ పూర్తిగా దిగజారి వ్యవహరిస్తోంది. ఆమెను అనరాని మాటలు అంటున్నారు. తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. సైకో సేన చేష్టలు చూస్తుంటే పిఠాపురంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది.