ఇన్నేళ్ళుగా బాబు వేసే డప్పు, చెప్పే అబద్దాలు చాలవని ఇప్పుడు కొత్తగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రంగ ప్రవేశం చేశారు. గంగపుత్రులతో జరిగిన సమావేశంలో బాబు వల్లే మత్స్య రంగం క్షేమం అని ప్రకటించారు.. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి..
గతంలో బాబు హయాంలో వేట నిషేధ సమయం లో మత్స్యకారుల కు భత్యం గా కేవలం 4 వేల రూపాయలే ఇవ్వగా, అది కూడా సమయానికి ఏ నాడూ యిచ్చిన పాపాన పోలేదు. కానీ జగన్ అధికారంలోకి రాగానే ఆ భత్యాన్ని 10,000 కు పెంచి వేట నిషేధ సమయం ఆరంభం లోనే ఠంచనుగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలోనే జమ చేస్తున్నారు..
ఇక మత్స్యకారుల బోట్ లకు వాడే డీజిల్ ఇంధనం పై సబ్సిడీగా బాబు హయాంలో లీటర్ కు 6 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు, అది కూడా 2002 కి ముందు రిజిస్టర్ అయిన బోట్ లకు మాత్రమే ఇవ్వడం జరిగేది. అంటే 2002 తర్వాత రిజిస్టర్ అయిన బోట్ లకు డీజిల్ సబ్సిడీ ఉండదు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార భరోసా పేరుతో లీటరుకు 9 రూపాయల సబ్సిడీ ఇవ్వడంతో పాటు 2002 తర్వాత రిజిస్టర్ అయిన బోట్ లకు కూడా సబ్సిడీ జమ చేస్తున్నారు..
తన 14 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఒక ఫిషంగ్ హార్బర్ కట్టాలన్న ఆలోచనే చేయని బాబు మత్స్యరంగ సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కలిగి ఉంటాడా? జగన్ ఈ తక్కువ కాలంలోనే 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాడు, దీనిబట్టి మత్స్య రంగ అభివృద్ధిపై మాట్లాడే అర్హత ఎవరికి ఉన్నట్లు? ఆయన ఎలాగూ నిజాలు మాట్లాడడు. తమరైనా స్టాటిస్టిక్స్ చూసుకుని మాట్లాడాలి కదా భువనేశ్వరి గారూ?