2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినా స్టీఫెన్సన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. స్టీఫెన్సన్కు డబ్బు ఇవ్వడానికి వెళ్లిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినా అసలు కథ నడిపింది మాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. రేవంత్ రెడ్డి డబ్బు తీసుకొని స్టీఫెన్ సన్ వద్దకు వెళ్లిన సందర్భంలో చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడాడు. ఆ ఫోన్లో మాట్లాడిన ఆడియో ఏసీబీ బయటపెట్టింది. ఆ సంభాషణలో చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్తో మాట్లాడుతూ”మనోళ్లు బ్రీఫ్డ్ మీ” అని అంటారు. ఆ మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ఇప్పటికే నిర్ధారించింది.
రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు వాయిదా కోరడంతో విచారణను గౌరవ బెంచ్ వాయిదా వేసింది. కాగా రేపు జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది.