ఏపీలో ప్రధాన పార్టీలయిన వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అధినేతలను వారి కార్యక్రమాలు , నివాసాలు చూసుకుంటే ముందుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా ఏపీలో సొంత నివాసం తాడేపల్లి లో ఏర్పాటు చేసుకొని అక్కడే నివసిస్తు, తన క్యాంప్ కార్యాలయంను కూడ అక్కడే నిర్మించుకొని అక్కడనుండే పాలన వ్యవహారాలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసం ను హైదరబాద్ లో ఉంచుకుని, చుట్టపు చూపుగా వారానికి మూడు రోజులు ఏపీలో నాలుగు రోజులు తెలంగాణలోని హైదరాబాద్ లోని సొంత ఇంట్లో గడుపుతూ వస్తున్నారు. టీడీపీ భావి నాయకుడు టీడీపీ కి కాబోయే అధినేత అయిన లోకేష్ కూడా రెండు రోజులు ఏపీలో వుంటే ఐదు రోజులు హైదరాబాద్ లో గడుపుతూ వస్తున్నారు. అఖరికి ఎలక్షన్ వచ్చిన ఈ తరుణంలో కూడా హైదరాబాద్ ను వదిలి రావడం లేదు.
మరో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి దారుణంగా నెలకు ఒక ఐదు లేదా ఆరు రోజులు మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ కు వస్తూ మిగిలిన రోజులు హైదరాబాద్ లోనీ తన ఫామ్ హౌస్ లో వుంటూ తన సినిమా షూటింగ్ లు కూడా హైదరాబాద్ లోనే చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఏదో నెలకు ఐదు, ఆరు రోజులు ఏపీకి వచ్చి వెళ్తున్నారు. ఎలక్షన్ ప్రచారం అంటూ తను పోటి చేస్తున్న పిఠాపురం కు వెళ్ళి ఐదు రోజులు ప్రచారం అని షెడ్యుల్ ప్రకటించి చివరకు రెండు రోజులకే అనారోగ్య కారణాలని ప్రకటించి హైదరాబాద్ కు తిరిగి వెళ్ళిపోయారు.
మరో ప్రతిపక్ష పార్టీ బిజెపి ఏపీ అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి తను కూడా హైదరాబాద్ ను వదిలి వచ్చింది లేదు ఇక్కడ బయట ప్రజలకు కనపడింది లేదు. మరో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన షర్మిల కూడా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు హైదరాబాద్ లో వుండి అక్కడే ప్రచారం చేసుకొని పోటి అని చివరాఖరికి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పొంతన లేని కారణాలతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈమె కూడా హైదరాబాద్ వదిలి వచ్చింది లేదు.
ప్రతి పక్ష నాయకులు అంతా హైదరాబాద్ లో నివాసం వుంటూ ఏపీ లో రాజకీయాలు చెయ్యడం చూసి ఏపీ ప్రజలు రాష్ట్రం మీద వాళ్ళ చిత్తశుద్దిని గమనించి నవ్వుకుంటున్నారు . వీరు రాష్ట్రం లోనే నివాసం వుండటం లేదు ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి అండగా వుంటారని చెప్పుకొంటున్నారు. తమకు అందుబాటులో ఉంటూ తమకు అండగా నిలబడుతున్న సీఎం జగన్ కే మరలా ఓటెయ్యాలని భావిస్తున్నారు..