ఇప్పటికే చప్పగా సాగుతున్న ప్రతిపక్ష కూటమి ప్రచారంలో మరో గుదిబండ పడింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ పై సీఎం జగన్ అప్పట్లో రాసిన లేఖ గురించి హై కోర్ట్ స్పందనే దానికి కారణం..
వివరాల్లోకి వెళితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాసిన లేఖ కు బదులివ్వాల్సిందేనని కోర్ట్ అభిప్రాయపడింది..
దీనితో ఎన్నికల వేళ ఇప్పుడు కూటమికి కొత్త చిక్కు వచ్చిపడినట్లు అయింది. కేంద్ర లో అధికారం లో ఉండి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్న బీజేపీ తో పొత్తులో ఉన్న టీడీపీ జనసేనకు ఇది ఒక రంగంగా షాక్ లాంటిది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కు జగన్ సహకరిస్తున్నారని, జగన్ ప్రైవేటీకరణ ను అడ్డుకోకుండా సమర్థిస్తున్నారని అప్పట్లో నానాయాగీ చేసిన బాబు, పవన్ లకు కోర్ట్ ద్వారా సమాధానం దొరికినట్లయింది. ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రానిది కాగా దానికి సీఎం జగన్ ను భాద్యుణ్ణి చేయడమే హాస్యాప్సాదం కాగా వైజాగ్ స్టీల్ భూములను కొట్టెయ్యాలని జగన్ ప్లాన్ వేశాడు అని టీడీపీ చేసిన ఆరోపణలు మరింత హాస్యాస్పదం. నేడు ఆ ప్రశ్నల్లన్నింటికీ కోర్టు సమాధానం ఇచ్చింది.
కాగా పొత్తులో భాగంగా రేపు ఉత్తరాంధ్ర లో కూటమి ఓట్లు అడగాలంటే ముందుగా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ చేయము అని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటీకరణ ను అడ్డుకోవడానికి బాబు అండ్ పవన్ లు చేసిన ప్రయత్నమేమిటో కూడా ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. బీజేపీ తో పొత్తు కోసం తహతలాడిన బాబు అండ్ పవన్ లు కనీసం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ను అయినా ఆపాలని బీజేపీ ని కోరలేదు సరికదా దాని ప్రస్తావన కూడా ఏనాడూ తీసుకురాలేదు. ఇప్పుడు జగన్ రాసిన లేఖకు కేంద్రం ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోతే దానికి కర్త కర్మ క్రియ జగనే అని ప్రజలకు సులువుగా అర్థం అవుతుంది. తన స్థాయిలో, సాధ్యమైనంత వరకు ప్రైవేటీకరణను ఆపాలని చూస్తున్న జగన్ రేపొద్దున ఉత్తరాంధ్ర లో ఇదే విషయం ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే అవకాశం ఉంది. దానికి ప్రతిపక్షాల వద్ద సమాధానమే ఉండకపోవచ్చు.
ఇదంతా పక్కన ఉంచితే ఈ వార్త ను ఈనాడు తప్పని పరిస్థుతుల్లో ఓ మూలన రాయాల్సి వచ్చింది. కేస్ మూలాలు అంతా జగన్ రాసిన లేఖ చుట్టే తిరగ్గా, ఈనాడు తెలివిగా వార్త మధ్యలో ఎక్కడో రెండు లైన్ లలో ప్రస్తావించింది. జగన్ చేసే ఏ మంచి మంచి కాదన్నట్లు ప్రచారం చేసే యెల్లో మీడియా కు కూడా నేడు సీఎం జగన్ చేసిన పనిని చెప్పక తప్పలేదు…