2024 సార్వత్రిక ఎన్నికలను నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మరొకపక్క గతంలో లాగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా ఎన్నికల యుద్ధానికి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమీపిస్తున్న వల్ల ఏ పార్టీకి మేనిఫెస్టోల పైనా అటు ప్రజలలోను ఇటు రాజకీయ విశ్లేషకులలోనూ ఆసక్తి నెలకొంది. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది.
అయితే వైయస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలు అమలు సాధ్యమయ్యేవిగానే ఉన్నాయన్నారు విమర్శకులు. అనంతరం నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అయితే ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు చాలా వరకు అమలు సాధ్యం కావని టీడీపీ జనసేన కూటమి పొత్తులో ఉన్న బీజేపీ నాయకులు సైతం విమర్శించడం గమనార్హం.
ఈ మేనిఫెస్టోకు సంబంధించి చంద్రబాబునాయుడు జనసేన బీజేపీని గాని మోడీని గాని సంప్రదించలేదని అది పూర్తిగా వారికి మాత్రమే సంబంధించిన మేనిఫెస్టో అని దానితో బీజేపీకి ఎంత మాత్రం సంబంధం లేదని బీజేపీ నేత జీవిఎల్ కుండబద్దలు కొట్టారు. టీడీపీ జనసేన నేతలతో ఎన్నికల ప్రచారంలో కూటమిలో భాగమైన బీజేపీని, మోడీ ఇమేజ్ ని వాడుకుంటే కూటమికి ఎక్కువ సీట్లు అవకాశం ఉందని, కానీ టీడీపీ జనసేన నేతలు బీజేపీ మోడీ ఇమేజ్ ని రాష్ట్రంలో ప్రచారానికి వాడుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.