2014లో నవ్యాంధ్ర ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం చేయని దోపిడీ అంటూ లేదు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు కేసులో ఇరుక్కుని ఉన్నపాటుగా ఆంధ్రలో రాజధాని అవశక్యత ఉన్నట్లు ముందుగానే తనకు కావాల్సిన వారి చేత అమరావతిలో భూములు కొనుగోలు చేపించి తర్వాత అక్కడ రాజధాని ఏర్పాటు చేశాడు.
ప్రస్తుత కేసు విషయంకు వస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అధికారాలు మొదట ఒక ప్లాన్ ఇచ్చారు, ఆ ప్లాన్ ప్రకారం నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ అస్తులుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. కానీ తమ స్వప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్లాన్ ను పూర్తిగా మార్చేసి తాము కొనుగోలు చేసిన భూములు మీదుగా వెళ్ళే విధంగా మాస్టర్ ప్లాన్ ను మార్చేశారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది సింగపూర్ కు చెందిన సూర్భన జ్యురాంగ్ కన్సల్టెన్సీ , CRDA వీరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం బాగా ప్రచారం చేసింది.
అప్పటి ఈ ఒప్పందాలు సింగపూర్ ప్రభుత్వ మినిస్టర్ అయినా ఈశ్వరన్ తో జరిగాయి అని నమ్మించారు కానీ అలాంటిది ఏమి జరగలేదు. అప్పటి సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్ ప్రస్తుతం సింగపూర్ లో భారీ కుంభకోణాలుతో జైల్ జీవితం గడుపుతున్నాడు అని అందరికీ తెలిసిన విషయమే. అలైన్మంట్ మార్పుతో నారా లోకేష్ కు సంభందించి 14 ఎకరాలు, లింగమనేని రమేష్ కి చెందిన 340 ఎకరాలు, నారాయణకు చెందిన 58 ఎకరాల భూములు విలువ అమాంతం పెరిగాయి, దాదాపు 3000 కోట్లు రూపాయల మేర భూములు విలువ పెరిగాయి. ఈ దోపిడీ పై వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ దర్యాప్తు వేగవంతం నమోదు చేసి కేసు పూర్వాపరాలు పరిశీలించి క్విడ్ ప్రో కో జరిగిన విషయం వాస్తవం అని ఏసీబీ కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.ఈ స్కాంలో ప్రధాన నిందితునిగా చంద్రబాబును ఏ1గా, నారాయణ ను ఏ2 గా వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, రమేష్ నిందితుల జాబితాలో చేర్చింది. ఏపీసీఐడీ సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం తప్పుడు ఒప్పందం అని నిర్ధారించింది.