2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు ఒక్క రోజు కూడా వదిలి పెట్టకుండా సీఎం జగన్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంటూ వచ్చాడు. వాలంటరీ వ్యవస్థ, సచివాల వ్యవస్థ, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతిదీవెన, ఇలా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ ప్రజలకు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం మీద, అభివృద్ధి కార్యక్రమం మీద ఎల్లో మీడియా ముసుగులో తన ఎల్లో మాఫియా అనుబంధ విభాగాల అండతో తిమ్మిని బొమ్మని చేస్తూ బురద జల్లుతూనే వచ్చాడు.
ఆఖరికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పరిపాలన అందించాలని సీఎం జగన్ చేసిన నిర్ణయం పైన, గ్రామస్థాయిలోనే పదిమందికి పైగా ప్రతి సచివాలయంలో ఏర్పాటు చేసిన శాశ్వత ఉద్యోగాలపైన తనదైన శైలిలో అక్కసు వెళ్ళకక్కాడు. ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే చంద్రబాబు దూషణలు అవమానకర వ్యాఖ్యలు మాటల్లో చెప్పలేం… వాలంటీర్లు గోనె సంచులు మోసే వారని, మగాళ్లు లేనప్పుడు ఇళ్లకెళ్లి తలుపులు తట్టే వారని, ఇలా అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాలంటరీ వ్యవస్థలో పనిచేసే వాళ్ళలో ఆడబిడ్డలు కూడా ఉన్నారన్న కనీస ఆలోచన విచక్షణ లేకుండా అవమానించాడు.
అయితే రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎప్పటిలాగే యూటర్న్ బాబు అని తనకున్న బిరుదును నిజం చేసుకున్నాడు. ఏ నోటితో అయితే ఏ వ్యవస్థలను అయితే తూలనాడాడో అవే వ్యవస్థలు స్వచ్ఛమైనవి గొప్పవి అంటూ కితాబులిచ్చాడు. మొన్నటిదాకా జగన్ ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలే లేవు అని అరిచి గోల పెట్టిన చంద్రబాబు మొన్నటికి మొన్న సచివాలయ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ అక్షరాలా 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలు కల్పించాడని ఒప్పుకున్నాడు. నిన్నటికి నిన్న ఏ నోటితో అయితే వాలంటీర్లు అరాచక శక్తులు అని అన్నాడో అదే నోటితో వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని, మేం అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తాం దాని స్థానంలో జన్మభూమి కమిటీలు తీసుకువస్తామని చెప్పిన నోటితోనే వారికి జీతాలు కూడా పెంచుతానని అన్నాడు.
ఏది ఏమైనా సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుండి నేటి వరకు గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు, అతని అనుకూల మీడియా, తన ఆస్థాన పండితులు, ఎల్లో మాఫియా ముసుగులో ఇంతకాలం వైయస్ జగన్ పైన, ఆయన ప్రభుత్వం పైన చేసిన విమర్శలన్ని బోగస్ అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన ఈ 58 నెలల లోను సీఎం జగన్ కొన్ని లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాడని, ప్రతి గడపకు ప్రజా పరిపాలన చేరుస్తూ అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశాడని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడు.