ఉత్తరాంధ్ర అంటేనే బీసీ సామాజిక వర్గాలు అత్యధికంగా వుండే ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు బీసీ సామజిక నాయకులకి అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా టిక్కెట్లు కేటాయిస్తారు. అలాంటి చోట మొదటి సారిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు అతి తక్కువ సీట్లు కేటాయించారు. విజయనగరం లోకసభ నియోజకవర్గం పరిధలోని ఏడు అసెంబ్లి స్థానాలకు గాను ఒకటి రిజర్వ్ స్థానం తీసేస్తే ఆరు స్థానాలకు ఇద్దరికి మాత్రమే బీసీ లకు అవకాశం ఇచ్చింది. అదే టైంలో ప్రత్యర్ధి పార్టీ అయినా వైసీపీ ఐదు నియోజకవర్గాల్లో బీసీ లకు అవకాశం ఇచ్చింది.
పొద్దున లేచిన దగ్గరనుండి మాది బీసీల పార్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇస్తాము, బీసీలే మా టీడీపీ పార్టీకి వెన్నుముక అంటూ మాటలు చెబుతూ వూదరగొట్టే చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి టికెట్ల కేటాయింపులో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా ఇచ్చిన నెల్లిమర్ల లో బ్రాహ్మణ వర్గంకు , బొబ్బిలి లో వెలమదొరలకు, ఇక ఎచెర్ల లో బిజెపి తరుపున కమ్మ సామాజిక వర్గంకు, విజయనగరంలో క్షత్రియ సామజిక వర్గానికి, గజపతినగరం లో తూర్పు కాపులకు , చీపురుపల్లిలో తూర్పు కాపులకు, రాజం రిజర్వ్ స్థానం, ఎక్కడ కూడా జనాభా లేని వెలమ దొరలకు, క్షత్రియ రాజులకు సామంతులు అనే పేరుతో రెండు టికెట్ లు ఇచ్చి 60% వుండే బీసీ లకు కేవలం రెండు స్థానాల్లో మాత్రమే పోటీకి అవకాశం ఇచ్చారు కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడు. విజయనగరంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల వెలమలు అధిక సంఖ్యలో వుంటారు వారికి ఓక్క సీటు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ పార్టీ మరియు కూటమి భాగస్వామ్యులు అయిన జన సేన, బిజెపి పార్టీలు.
దీనితో బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్న టీడీపీని ఈ ఎలక్షన్ లో ఓడించి తీరుతాం అని బీసీ సంఘాల నాయకులు ప్రకటించారు. ఉత్తరాంధ్ర లో అది విజయనగరం లో బీసీ జనాభా ఎక్కువ అయిన కూటమి బీసీ లను పట్టించుకోకపోవడం వారి పుట్టి ముంచడం ఖాయం గా కనిపిస్తుంది.