గత నాలుగు రోజులుగా రాష్ట్రం చూపు బెజవాడ మీద ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీద వున్నాయి. అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన రాయి దాడి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే, అందులో భాగంగా బస్సు యాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్ నగర్ చేరుకోగానే ఒక అగంతకుడు జగన్ మీద రాయి దాడి చేసారు. అది తృటిలో తప్పి కంటి పై భాగాన తగిలి మూడు కుట్లు పడ్డాయి. దాని మీద విచారణ ప్రారంభించిన పోలీసులకు , విజయవాడ ప్రజలకు అన్ని వెళ్ళు టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి అయిన బొండా ఉమ అతని అనుచరుల వైపు చూపించాయి. ఆ పై రెండు రోజులు అజ్ఞాతం లోకి వెళ్లి వచ్చిన బొండా ఉమ ఎన్నికల ప్రచారంలో వుండగా తమ వీధిలో భాగంగా బందోబస్తు కు వచ్చిన పోలీసులను చూడగానే తన్ని అరెస్ట్ చెయ్యడానికి వచ్చారు అని కార్యకర్తలకు పిలుపునిచ్చి హడావుడి చేసిన ఉమ చివరకు దొడ్డి దారిన పారిపోయారు.
ఇక జగన్ మీద రాయి విసిరిన కేసులో పోలీసుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను రెండు రోజుల్లో పట్టుకున్నారు. రాయి విసిరింది సతీష్ గా అతనికి సహకరించింది దుర్గారావు అని పోలీసులు ప్రకటించారు.పోలీసుల విచారణలో సతీష్ కావాలనే పథకం ప్రకారం జగన్ మీద దాడికి దిగాడు అని ఒక ప్రయత్నంలో విఫలం చెంది రెండో ప్రయత్నంలో దాడి చేశారు అని పోలీసులు తెలిపారు. ఈ దుర్గారావు మరియు సతీష్ ఇద్దరు కూడా బోండా ఉమ అనుచరులు. అంతే కాకుండా దుర్గారావు దాడి జరిగిన తరువాత సతీష్ ను తీసుకొని బోండా ఉమ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉమ రెండు రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళి వచ్చి నాకు ఈ దాడికి సంబంధం లేదు నాపేరు కావాలని పెడితే అటు పోలీసులకు, ఇటు దాడి చేసిన వారికి తీవ్ర పరిణామాలు వుంటాయి అని హెచ్చరించారు. దీని తరువాత సతీష్ ను A1 గా చూపించి కోర్ట్ లో సబ్మిట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు. ఆ తరువాత గత రాత్రి పోలీసులు తమ విధుల్లో భాగంగా బందోబస్తు కు వస్తే కార్యకర్తలకు మీడియాకు తనని అరెస్టు చేస్తున్నారు అంటూ ఫోన్లు చేసిన ఉమ ఆ పై దొడ్డి దారిన గోడ దూకి పారిపోయారు.
ఇప్పుడు ఇదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తమ విధుల్లో భాగంగా బందోబస్తు కు వస్తే ఉమ ఎందుకు పారిపోయాడు అసలు నన్ను అరెస్ట్ చేస్తారు అని దేనికి భయపడ్డారని పట్టణం వ్యాప్తంగా ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయి .