ఎన్నికల కమిషన్ అంటే టీడీపి వారికి పెద్ద జోక్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక నగదు, మద్యం పంచడం వంటి వాటిని ఓటరుని ప్రలోభపెట్టే చర్యగా ఎన్నికల కమీషన్ భావిస్తుంది, అందుకే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ ఎటువంటి నగదును పెంచి కూడదు. అంతేకాక ప్రజలకు ఉపయోగపడుతున్న ఏ పధకం అమలుచేస్తున్నా కూడా దానిని ఎన్నికల ప్రచారంగా వాడుకోకూడదు. తెలంగాణ ఎన్నికల సమయంలో రైతుబంధుని తమ పార్టీ మైలేజి కోసం వాడాలని, వ్యాఖ్యలు చేయగానే ఎన్నికల కమీషన్ ఆ పధకం అమలును ఎన్నికలయ్యేంత వరకూ రద్దు చేసింది.
కానీ, నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో.. చంద్రబాబు అరెస్టు అయినయిపుడు, చనిపోయిన వారి కుటుంబాలను పలకరించడం అనే వంకతో తిరుగుతూ ఇప్పటివరకూ కొంత మందికి మూడేసి లక్షల రూపాయలు చొప్పున నగదు అందించారు. కానీ, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కూడా
ఈ నెల 20న అన్నమయ్య జిల్లా రాయచోటిలో యాత్రను నిర్వహించి నగదు పంపిణీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం నగదు విరాళం ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అది చేయకుండానే నిజం గెలవాలి యాత్ర లో నగదు అందించారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో నిర్వహిస్తున్న యాత్ర సందర్భంగా నగదు అందించడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు మీద అన్నమయ్య జిల్లా కలెక్టర్ విచారణను ప్రారంభించారు.
ఇది ఇలా ఉండగా, ఎన్నికల కమీషన్ కళ్ళు కప్పేందుకు టీడీపీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. నగదు ఇచ్చినందుకు ఫిర్యాదు చేసారు కాబట్టి, ఈ సారి నగదు ఇవ్వకుండా ఆ మూడు లక్షల మేర ఆర్థిక పత్రాలను అందచేసే ఘట్టానికి తెరలేపింది. అంటే మూడు లక్షలకు గ్యారంటీగా చెక్కులో, బాండులో ప్రజలకు అందజేస్తున్నారు అన్నమాట. ఏ రూపేణా డబ్బు అందించినా అది ప్రలోభమే. పైగా ఇది టీడీపికి బాగా అలవాటయిన ప్రలోభం. గతంలో కూడా బాబు ఇలానే తన పాలనలో ప్రజలకు ఆర్థికపత్రాలు అందజేసి, ఆపై అవి చెల్లుబాటు కాకుండా చేసి మోసం చేసాడు. ఈ సారి ఇలా ఇస్తూ… ఒకే దెబ్బకు ఎన్నికల కమీషన్ ను, ప్రజలనూ కొట్టబోతున్నాడు.