ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంది. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బిజెపి, జనసేన మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , అతని అనుకూల మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారం అగ్గిని రాజేసింది.చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా అండతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ప్రజల భూములు ప్రభుత్వము తీసుకుంటాది అంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. దీనిమీద చంద్రబాబు నాయుడి వదిన , ఏపీ బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ చట్టం మీద మీడియా ప్రతినిధులు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, వారికి చట్టం మీద కనీస అవగాహన లేదు అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తయారు చేసిందీ కేంద్ర ప్రభుత్వంలోని మోడీ. ఇప్పటికే బిజెపి పాలిత ప్రాంతాలో 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నరు. దీని వలన రైతులకు, ప్రజలకు మంచి జరుగుతుంది. భూమికి సంబంధించిన ఆధారాలు అన్ని ఒక్క దగ్గర వుంటాయి. ఈ చట్టం అమలు అయితే దేశంలో భూములు కొనడం లేదా అమ్మడంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు . ధైర్యంగా ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు ఎలాంటి సమస్య వచ్చిన ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఆ సమస్యలను అతి తొందరగా పరిష్కరం చేసుకోవచ్చు అలాంటి చట్టం మీద కనీస అవగాహన లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రత్యేక మీడియా వర్గం కావాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఆ చట్టం తయారు చేసి అమలు చేస్తున్న మోడీ, బిజెపి మీద విష ప్రచారం చేస్తున్నారు అంటూ మండి పడుతున్నారు.
ఇక ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చెయ్యడం లేదు, హైకోర్ట్ లో కేసు నమోదు అయ్యి అక్కడ స్టేలో వుంది అలాంటి సమయంలో రాష్ట్రంలో ఎలా అమలు చేస్తాం అంటూ నిలదీస్తున్నారు . అంతే కాకుండా అసలు ఈ చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వంలోని బిజెపి, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే అక్కడి పరిస్థుతులు చూసాక మన రాష్ట్ర రైతులుతో మాట్లాడి కానీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అమలు చేసేది లేదు అంటూ తెగేసి చెప్పారు.
ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు, పురంధేశ్వరి మాటలు చూస్తుంటే కూటమిలో అగ్గి రాజుకొని కూటమి మొత్తాన్ని ఎక్కడ ఆ అగ్గికి ఆహుతి అవుతాదో అని అభ్యర్థులు భయపడుతున్నారు.