2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లాక్కుంటారని చేస్తున్న దుష్ప్రచారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పైన కేసు నమోదు చేయాలని ఏపీ సిఐడికి ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు మంగళగిరి సిఐడి కార్యాలయంలో కేసును నమోదు చేశారు. కేసు నమోదు లో భాగంగా ఎఫ్ ఐ ఆర్ లో మొదటి ముద్దాయిగా నారా చంద్రబాబు నాయుడు ను, రెండో ముద్దాయిగా నారా లోకేష్, మూడో ముద్దాయిగా టీడీపీ పార్టీని, నాలుగు ఐదు ఆరు ముద్దాయిలుగా ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తర్వాత వారి నుంచి వివరణ తీసుకొని ఎన్నికల కమిషన్ కి వీలైనంత త్వరగా రిపోర్ట్ అందజేయాలని ఈసీ ఇప్పటికే తెలిపింది.