నిన్న ఏపీ లో తాము పోటి చేసే అభ్యర్ధులను బిజెపి ప్రకటించింది. వాటిలో బాబు అనుచరులే తప్ప అసలు సిసలైన పాత వారు, సీనియర్ బిజెపి నాయకులూ ఒక్కరు కూడా లేరు. బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి గారు తన బావ మరిది అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసం ఏపి బీజేపీని తాకట్టు పెట్టి, పార్టీ సీనియర్ నాయకులను కాదని టీడీపీకి అందులో చంద్రబాబుకు అత్యంత ప్రీతి పాత్రులకు బిజెపి తరుపున టికెట్ లు దక్కడంలో చక్రం తిప్పారు.
బిజెపి సీనియర్ నాయకుడు రాజ్యసభ ఎంపీ జీ వి ఎల్ నరసింహారావు వైజాగ్ నుండి పోటీ చెయ్యాలని గత రెండు సంవత్సరాలుగా కష్ట పడుతూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు, చివరకు జీవియల్ కి కాకుండా తన కుటుంబ సభ్యుడు అయిన భరత్ కోసం అ సీటును టీడీపీకి వదిలిపెట్టారు పురందేశ్వరి. ఒకవేళ ఎంపీగా గెలిస్తే మంత్రి పదవి విషయంలో తనకు పోటి వుండకూడదు అని జీవియల్ కి మరి ఎక్కడా టికెట్ రాకుండా అడ్డుకున్నారు.
మరో బీసీ నాయకుడు మాధవ్ బిజెపి కి నమ్మిన బంటుగా విశాఖ నార్త్ నుండి పోటీ కి గత 5 సంవత్సరాలు గా సన్నద్ధమవుతున్నారు, తీరా ఎన్నికల వేల చంద్రబాబు నాయుడి మనిషి అయిన విష్ణు కుమార్ రాజు కి టికెట్ ఇప్పించి పార్టీకి నమ్మిన బంటు అయిన మాధవ్ కు వెన్నుపోటు పొడిచారు. ఇక బద్వేల్ లో అయితే టికెట్ ఇచ్చిన తరువాత టీడీపీ నుండి రోషన్ ను బిజెపి లోకి తీసుకొని టీడీపీకి చంద్ర బాబు కు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.
బాబు కు నమ్మిన బంట్లు, కుడి ఎడమ భుజాలు అయిన సిఎం రమేష్, సుజనా చౌదరి లకు టికెట్ ఇప్పించడం లో విజయం సాధించి తన మరిది చంద్రబాబు నాయుడు సంతోష పడేలా చేశారు. అంతటితో ఆగకుండా చివరకు తాను పోటి చేద్దాం అనుకున్న విశాఖ సీటును తనకు అల్లుడు వరుస అయ్యే చంద్రబాబు నాయుడి చిన్న అల్లుడు కోసం త్యాగం చేసి రాజమండ్రి నుండి పోటీ కి రెడీ అయ్యారు.
ఇటు రాయలసీమలో ధర్మవరం సీటు విషయంలో చంద్రబాబు కోసం చెయ్యాల్సిన డ్రామా అంతా చేశారు. అక్కడ వరదాపురం సూరికి సీటు ఇస్తే పరిటాల కుటుంబం కు కోపం వస్తుంది దానితో చంద్రబాబు కు ఇబ్బందని తలచి వరదాపురం సూరి కి టికెట్ ఇవ్వకుండా గత పది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడి కోసం బిజెపి లో పని చేస్తున్న సత్యకూమార్ కు టికెట్ ఇప్పించారు.
మొత్తానికి ఏపీ బిజెపి నీ తన మరిది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కు అప్పజెప్పి పూర్తిగా టీడీపీ బి టీమ్ గా తయారు చెయ్యడం లో బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయం సాధించారు.