టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు, టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడు, జన సేన తరుపున అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి తరుపున సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ నేతలు అరుణ్ సింగ్ , శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.
వీరి సమావేశం కు ముఖ్య కారణం అనపర్తి, ఉండి, నర్సాపురం, అరకు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు నర్సాపురం ఎంపీ సీట్ల కేటాయింపుల విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి పాల్గొన్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే అనపర్తిలో బిజెపి అభ్యర్థి ప్రచారానికి వెళ్తుంటే టీడీపీ నాయకులు తమ టీడీపీ జెండాలు తీసేసి ప్రచారం చెయ్యాలి అని అడ్డుకుంటున్న సంఘటనలను చూసాము, ఉండిలో రఘురామ కృష్ణంరాజుకు టికెట్ అని జరుగుతున్న గొడవలు , ధర్నాలు దీక్షలు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఉండి కాకుండా రఘురామ కృష్ణంరాజు నర్సాపురం ఎంపీ సీటు ఇచ్చి బిజెపికి నర్సాపురం అసెంబ్లీ స్థానం ఇచ్చేలా లేదా రఘురామ కృష్ణంరాజుకు నర్సాపురం అసెంబ్లీ స్థానం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. దీంతో జన సేన నాయకులు ఎక్కడ తమకు ఇచ్చిన 21 సీట్లలో ఇంకా ఎన్ని తీసుకుని త్యాగాలు చెయ్యమంటారో అని గిలగిల లడుతున్నారు. ఇక అరకు అసెంబ్లీ బిజెపి నుండి తీసుకొని టీడీపీ పోటీ చేసేలా బిజెపి కి పాడేరు అసెంబ్లీ స్థానం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ఇవీ ఇంకా కూటమిలో ఎంత రచ్చకు దారి తీస్తాయి తెలియడం లేదు .
ఈ సమావేశంలో అభ్యర్థులు పోటీల గురించి అలాగే కూటమి తరపున కీలకమైన మ్యానిఫెస్టో రిలీజ్ తో పాటు ముఖ్య నేతల ప్రచార సభలు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చెయ్యాలి ఎవరెవరు పాల్గొంటారు అని గురించి చర్చించనున్నారు. ఈ విశేషాలను కూటమి సమావేశం తరువాత మూడు పార్టీల నాయకులు మీడియాకు వెల్లడించానున్నారు అని సమాచారం.