2024 సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సినీ హీరో చిరంజీవి చేస్తున్న చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి . ఎన్డీఏ కూటమి తరుపున పోటీ చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించాలని వీడియో బైట్ రూపంలో ప్రజలకు విన్నపించుకున్నారు. కూటమిలో బిజెపి తరుపున పోటీ చేస్తున్న సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్.. జనసేన తరుపున పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు తరుపున వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా […]
చిరంజీవి గొప్ప నటుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సినిమాల్లో కంటే నిజ జీవితంలో ఇంకా అద్భుతంగా నటిస్తాడు. తన స్వార్థం కోసం నాలుకను ఎన్ని మడతలైనా పెడతాడు ఈ బాసు. తాజాగా ‘టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలి’ అని సీఎం రమేష్ను పక్కన పెట్టుకుని వీడియోలో అన్నాడు. రాజకీయాల్లో మెగా బిగ్ బ్రదర్ చేసిన విన్యాసాలు చూస్తే ఔరా అనిపించక మానదు. […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎన్డీఏ కూటమి ఖరారు అయినప్పటికీ నియోజవర్గ స్థాయిలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. టికెట్ తెచ్చుకున్న అభ్యర్థికి మరో పార్టీ నాయకులు సపోర్ట్ చేసే దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్రస్థాయి నాయకత్వం నియోజకవర్గాలలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇతర పార్టీ నాయకులు రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ […]
తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరుపున జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించిన రోజు నుండి ఈరోజు వరకు చెలరేగిన మంటలు ఏదొక రూపంలో రగులుతూనే వున్నాయి. మొదట టీడీపీ నాయకులు మేమే పోటీ అంటూ ప్రకటించి గొడవలు చేశారు. తీరా జనసేన నుండి అరని శ్రీనివాసులకు టికెట్ ఇవ్వగానే జనసేన లోని కీలక నేతలు మేము సహకరించే పరిస్థితులు లేవు అని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని గొడవ గొడవ చేశారు. తరువాత పార్టీ పెద్దల సూచనతో […]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు, టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడు, జన సేన తరుపున అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి తరుపున సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ నేతలు అరుణ్ సింగ్ , శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. వీరి సమావేశం కు ముఖ్య కారణం అనపర్తి, ఉండి, నర్సాపురం, అరకు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు నర్సాపురం ఎంపీ సీట్ల కేటాయింపుల విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్దం సాగుతోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమిని వైసీపీకి ధీటుగా తయారుచేసేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిదంటూ టీడీపీ నేతలు కూడా అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ కైకలూరు అభ్యర్ధి, మాజీ […]
2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కలగలిసి ఎన్నికల బరిలో దిగుతున్నవేళ టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారం ఆశ్చర్యకరంగా మారింది. మామూలప్పుడు బీజేపీపై రెచ్చిపోయి రంకెలేసే చంద్రబాబు.. ఈ ఎన్నికలకు మాత్రం ఆ పార్టీతో పొత్తు కోసం కాళ్ల భేరానికి సైతం వెనకాడలేదంటూ బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు.. నేను తిరగబడ్డ తెలుగుబిడ్డను అన్నాడు. జాతీయస్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసి మోదీని దించుతానన్నాడు.. బీజేపీని పడగొట్టేది నేనే […]
‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ కోసం శ్రీరాముడు అంతటి వారే ఆంజనేయస్వామితోపాటు ఉడుత సాయం తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. దుష్టశిక్షణ.. శిష్టరక్షణ జరగాలి. కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటా’ తెలుగుదేశం, జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల సంగతేంటని విజయవాడలో ఆదివారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అది. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే లక్ష్యం. అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తాయి. దీనికి బీజేపీ ఏమీ […]
చంద్రబాబు బిజేపీ పొత్తు పొడిచినట్టే . తాను ఏంచేసినా లోకకళ్యాణం కోసం, తీసుకునేవన్నీ చారిత్రాత్మక నిర్ణయాలే అని భావించే బాబు ఢిల్లీలో పగలు రాత్రి కాపు కాచి ఎట్టకేలకు బీజేపీతో పొత్తుని ఖరారు చేసుకున్నట్లుంది . బీజేపీకి ఆరు యంపీలు, పదహారు ఎమ్మెల్యేల సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చేందుకు బాబు ఒప్పుకున్నారని సమాచారం . ఢిల్లీలో ఈ నెల 14 న NDA మీటింగ్ జరిపి.. అధికారికంగా పొత్తులు ఆ రోజు ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీ […]
2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజ్ అంటూ కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు చివర్లో బీజేపీకి ఎదురు తిరిగి పెద్ద డ్రామానే నడిపారు. అందులో భాగంగానే హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి చేయించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై ఘాటైన విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో భూస్థాపితం కానున్న టీడీపీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందుకోసం […]