ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కావడంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు […]
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. తాజాగా ఆమెకు మధ్యంతర బెయిల్ను నిరాకరిస్తూ నేటి ఉదయం తీర్పు వెలువరించింది. కాగా తన కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా ఆమె కుమారుడికి ఇప్పటికే పరీక్షలు పూర్తయినందున బెయిల్ మంజూరు […]
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. తద్వారా ముఖ్యమంత్రిగా ఉంటూ తీహార్ జైలుకు వెళ్తున్న మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు. ఈడీ కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనను ఈడీ హాజరుపరిచింది. దీంతో కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కాగా తీహార్ జైల్లో కేజ్రీవాల్కు ప్రత్యేక […]
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి విదితమే. ఆయన అక్కడినుండే పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించిన విధంగానే ఢిల్లీలో తలెత్తబోయే నీటి సమస్య గురించి ఈడీ కస్టడీ నుండి తొలి ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన మరో ఉత్తర్వు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ […]