ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లనున్నారు. తద్వారా ముఖ్యమంత్రిగా ఉంటూ తీహార్ జైలుకు వెళ్తున్న మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు. ఈడీ కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనను ఈడీ హాజరుపరిచింది. దీంతో కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
కాగా తీహార్ జైల్లో కేజ్రీవాల్కు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేయడం గమనార్హం. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, అలాగే పుస్తకాలను అనుమతించాలని, మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్ను అనుమతించాలని కేజ్రీవాల్ తరపు లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ విచారణలో సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలతో దర్యాప్తును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఈడీ కోర్టుకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీహార్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో పాటు, మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్లను కలిసేందుకు కోర్టు అనుమతించింది.