విశాఖపట్నం పోర్టు అధారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పి చరిత్రను తిరగరాసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు రోజులు మిగిలి ఉండగానే పోర్టు చరిత్రలోనే మొదటిసారి ఒక్క రోజులోనే 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి పాత రికార్డులను అధిగమించింది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల విశాఖ పోర్టు చైర్ పర్సన్ డాక్టర్ ఎం. అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు నూతన రికార్డును సృష్టించడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్ […]
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే,.విశాఖపట్నాన్ని ఎలా తీర్చిదిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది.రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవసాయం వాటా 17–18 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో అయితే ఇది 35శాతంగా ఉంది.ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి్ చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు. ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే […]
ప్రపంచం లో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి నార్వే. మానవాభివృద్ధి సూచీలోనూ, తలసరి ఆదాయ సూచీ లోనూ, పేదరిక సూచీలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల అభివృద్ధి సూచీలలో నార్వే మొదటి మూడు స్థానాల్లోనే ఉంటుంది.. అంత మాత్రానికే అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప వనరులు ఉన్నాయని కాదు. సంవత్సరం లో ఆరునెలలు పూర్తిగా చీకటిలోనే ఉండే దేశం అంత ప్రగతి ఎలా సాధించింది… వనరులు ఉండటం గొప్ప కాదు, తక్కువ వనరులు […]