విశాఖపట్నం పోర్టు అధారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పి చరిత్రను తిరగరాసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు రోజులు మిగిలి ఉండగానే పోర్టు చరిత్రలోనే మొదటిసారి ఒక్క రోజులోనే 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి పాత రికార్డులను అధిగమించింది.
పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల విశాఖ పోర్టు చైర్ పర్సన్ డాక్టర్ ఎం. అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు నూతన రికార్డును సృష్టించడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్ మేనేజర్నీ, అతని బృందాన్ని చైర్ పర్సన్ ప్రశింసించారు. పోర్టు ఉద్యోగులు మరింత శ్రమించడం ద్వారా నూతన రికార్డులను అధిగమించవచ్చునని ఆయన ఆకాంక్షించారు.
ఈ ఏడాది క్రూడ్ ఆయిల్ రవాణాలో 27 శాతం, ఇనుప ఖనిజం 12 శాతం, ఎరువులు 6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. 43 భీమ్ కలిగిన బేబీ కేప్ నౌకలు గత ఏడాదితో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల నమోదైందని పోర్టు అధికారులు తెలిపారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ సైతం 28 శాతం అధికంగా 6.65 లక్షల టిఈయులను హ్యాండిల్ చేసినట్టు తెలిపారు. ప్రిబెర్తింగ్ డిటెన్షన్ లో 68శాతం, టర్న్ అరౌండ్ టైం. అవుట్ ఫుట్ ఫర్ షిప్ బెర్త్ డే లో 10 శాతం, ఐడల్ టైం బెర్డింగ్ లో 8 శాతం మెరుగుదలను నమోదు చేసిందని పోర్టు చైర్మన్ తెలిపారు.
ఇప్పటికే గతేడాది జూన్ 17 తేదిన చేసిన 4,01,875 మిలియన్ టన్నుల సరుకు రవాణా రికార్డును ఈ ఏడాది జనవరి19న ఒక్క రోజులో 4,03,978 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిన పోర్టు ఆధారిటి తాజాగా బుధవారం రాత్రి చేసిన 80మిలియన్ టన్నులను ఒక్క రోజులో అత్యధిక సరుకు రవాణాచేసి ఆయా రికార్డులను తిరగరాసినట్టు పోర్టు ట్రాఫిక్ విభాగ అధికారులు తెలిపారు.