దేశంలో ఈ నినాదం దశాబ్దాల కాలంగా కేవలం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మాటలకు, మీడియా బూటకపు రాతలకు మాత్రమే పరిమితం అయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటినుండి పిల్లలు చదువులు పట్ల వారి భవిష్యత్తు పట్ల చేతల్లో చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వాలను నేతలను మనం ఎప్పుడైనా చూసామా? బహుశా పిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా! వారిపై మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేది ఆయా ప్రభుత్వాలు, నేతలు, రాజకీయ పార్టీలు ఉద్దేశం కాబోలు. […]
ఏపీ మరోసారి దేశవ్యాప్తంగా సత్తా చాటింది. పాఠశాల విద్యార్థుల చేరికల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకున్న జగన్ ప్రభుత్వం సత్ఫలితాలను రాబట్టడంలో విజయవంతం అయింది. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో పిల్లల చేరికలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అని తమ నివేదికలో తెలిపింది. విద్యార్థుల చేరికలో ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ స్థానం దక్కగా తరువాతి స్థానాల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్లో ఏపీ విద్యాశాఖ శకటాన్ని ప్రదర్శించింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్తో రూపొందించిన ఈ శకటానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. పీపుల్స్ చాయిస్ విభాగంలో తృతీయ స్థానం దక్కింది. విద్యా రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి ఇది నిదర్శనం. ఇదీ జగన్ మార్క్ విద్యా వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాశనం […]