ఏపీ మరోసారి దేశవ్యాప్తంగా సత్తా చాటింది. పాఠశాల విద్యార్థుల చేరికల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకున్న జగన్ ప్రభుత్వం సత్ఫలితాలను రాబట్టడంలో విజయవంతం అయింది. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో పిల్లల చేరికలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అని తమ నివేదికలో తెలిపింది. విద్యార్థుల చేరికలో ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ స్థానం దక్కగా తరువాతి స్థానాల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. కాగా 2021 సంవత్సరంలో ప్రైమరీ లో 18.4%, అప్పర్ ప్రైమరీ లో 13.4 %, ఎలిమెంటరీ లో 16.5 % పెరిగింది ఎస్బిఐ తమ నివేదికలో వెల్లడించడం గమనార్హం.
పాఠశాలల్లో చేరికలు పెరగడానికి ప్రధాన కారణం సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమని చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే రాష్ట్ర విద్యా రంగంలో సంస్కరణలకు సీఎం జగన్ తెరలేపారు. నాడు నేడు పథకం ద్వారా విద్యాలయాల స్వరూపాన్నే మార్చివేసిన జగన్ పిల్లలను పాఠశాలకు పంపించే తల్లుల ఖాతాలో 15వేల రూపాయలను వేస్తూ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకి పౌష్ఠికమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే ప్రతి పిల్లవాడికి ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, టై, బెల్ట్, షూ, ఎనిమిదో తరగతి చదివే ప్రతి పిల్లవాడికి బైజుస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ఫ్రీ గా అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుంది.
బైజూస్ కంటెంట్ విద్యార్థులు బయట కొనాలంటే ఏడాది కి 50 వేల రూపాయిల ఖర్చవుతుంది కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించి నాణ్యమైన విద్యను అందిస్తుంది. నాడు నేడు క్రింద కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చి వాటితో పోటీ పడేలా చేసింది. ప్రతి క్లాస్ రూం లో ప్రొజెక్టర్, డిజిటల్ బోర్డ్, బెంచీలు, ఫ్యాన్లు ఇలా అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పించింది. వీటితో పాటుగా గ్రామ,వార్డు సచివాలయలు పరిధిలో విద్యార్థులు ఎవరైనా స్కూల్ కు వెళ్ళకపోతే వాలంటీర్లు ద్వారా కారణం తెలుసుకొని పిల్లలను తిరిగి స్కూల్ కి పంపించేలా చర్యలు చేపట్టింది జగన్ ప్రభుత్వం. ఇప్పటివరకూ దాదాపు నాడు నేడు పథకం ద్వారా రెండు ఫేజ్ లలో 37 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చింది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి.