నరసాపురం, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే విషయంపై అటు తెలుగుదేశం.. ఇటు భారతీయ జనతా పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి, ఏలూరు సీటు టీడీపీకి వెళ్లింది. అయితే బరిలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు.
ఏలూరును కమలం పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అడుగుతున్నారు. ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. నరసాపురానికి సంబంధించి రెబల్ స్టార్ కృష్ణంరాజు మేనల్లుడు దంతులూరి నరసింహరాజు తెరపైకి వచ్చారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని ఈయన భావిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన ఈ సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచినా.. స్వార్థం కోసం చంద్రబాబు నాయుడి పంచన చేరారు. అప్పటి నుంచి టీడీపీ రఘురామను బాగా వాడుకుంది. ఎల్లో మీడియా డిబేట్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాగా తిట్టేవాడు. టీడీపీ, బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తానే బరిలో ఉంటానని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల సమయం వచ్చే సరికి ఏ పార్టీ కూడా ఆయనకు క్లారిటీ ఇవ్వలేదు.
ఇంతకాలం బాబు వాడుకున్నారు. సీటు ఇస్తారేమో టీడీపీలో చేరి పోటీ చేద్దామని భావిస్తే ఆయన బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు. వారేమో ఎటూ తేల్చడం లేదు. ఓకే చెబితే ఆ పార్టీ కండువా అయినా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కృష్ణంరాజు మేనల్లుడు టికెట్ తనకే అంటున్నారు. ఏలూరు విషయంలోనూ కమలం పెద్దలు గట్టిగా ఉన్నారు. ఒకవేళ ఈ సీటు తీసుకుంటే నరసాపురం వదులుకోవాలి. అక్కడ చంద్రబాబు రఘురామకు అవకాశం ఇస్తారా అనేది డౌటే. లేదా కాషాయం పార్టీ నరసాపురం తీసుకుంటే సీనియర్లను కాదని చాన్స్ ఇవ్వకపోవచ్చు. అందులోనూ ఆయన వ్యవహారశైలిపై విమర్శలు ఉండడం, బ్యాంకులను మోసం చేయడం తదితర అంశాలు కలిసి రావడం లేదు. ఎలా చూసుకున్నా రఘురామకు 2019 చివరి ఎన్నికలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.