ఏ సంస్థ సర్వే చేసినా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. గత నెలలో జీన్యూస్ మ్యాటరైజ్ పోల్ సర్వే, టైమ్స్ నౌ సర్వేలు, రిపబ్లిక్ టీవీ సర్వేలలో ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగడం ఖాయమని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా టైమ్స్ నౌ సర్వేతో పాటుగా జన్ మత్ పోల్ సర్వేలు మరోసారి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తేల్చి చెప్పాయి.
టౌమ్స్ నౌ – ఈటీజీ రీసెర్చ్ సర్వేను పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్సభ స్థానాలను దక్కించుకుని ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3 నుంచి 4 లోక్సభ స్థానాలకే పరిమితం కానుందని తేల్చిచెప్పింది. దీంతో ఏపీలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టబోతున్నారని స్పష్టమైంది.
తాజాగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 118-120 స్థానాలను గెలుచుకుంటుందని, మరోవైపు టీడీపీ – జనసేన కూటమి 51-53 స్థానాలకు పరిమితం కానుందని జన్ మత్ పోల్స్ సంస్థ అంచనా వేసింది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. సర్వేలన్నీ జగన్ బాట పట్టడం టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉండటంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.