ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల హంగామా షురూ అయింది. ఎన్నికల కమీషన్ ఓట్ల పండగకు డేట్ లు ప్రకటించింది. దీనితో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించే పనులు అలాగే ప్రచార కార్యక్రమలు మొదలు పెట్టయి. ఇప్పటికే వైసీపీ తమ 175 అసెంబ్లీ , 24 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల రంగం లోకి దించింది, అ పార్టీ అధినేత జగన్ 27 నుండి మనమంతా సిధ్ధం పేరుతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇటు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఈ యాత్రా వుండబోతుంది.
ఇక టీడీపీ, జన సేన , బిజెపి కూటమి టికెట్ల కేటాయింపు దగ్గరే ఆగిపోయారు, కూటమి ప్రచారంలో భాగంగా మొదటి సభ చిలకలూరిపేటలో ఏర్పాటు చేసి ప్రధాన మంత్రిని ఆహ్వానించారు. దాని తరువాత కూటమిలోని మూడు పార్టీలు సైలెంట్ అయినాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరబాద్ లో తన ఇంటి నుంచి టికెట్ కేటాయింపులు చూస్తున్నారు. అలాగే టికెట్ రానివారిని పిలిపించుకొని బుజ్జగించడం చేస్తున్నారు. టీడీపీ లోని మరో కీలక నేత టీడీపీ వారసుడు లోకేష్ మంగళగిరి దాటి బయటకు రావడం లేదు. ఏ నాయకుడు ఎలా ప్రచారం చేస్తారు అనేది, వారి ప్రచారం ఏమిటీ అనేది ఇంకా బయటకు రాలేదు .
జనసేన పార్టీ తరుపున ఇచ్చిన 21 సీట్లకు అభ్యర్థులు దొరకక ఇచ్చిన 7-8 చోట్ల జరుగుతున్నా గొడవలను సర్ది చెప్పలేక పవన్ కళ్యాణ్ తికమక పడుతున్నారు. తనూ పిఠాపురంలో పోటి చేస్తాను అని ప్రకటించి తన దృష్టి అంతా పిఠాపురం మీద వుంచారు. మిగతా సీట్ల గురించి ఆలోచన చెయ్యడం లేదు. అలాగే ప్రకటించిన సీట్ల విషయంలో జరుగుతున్న గొడవలను సర్దిచెప్పడం పవన్ కళ్యాణ్ కు తలకు మించిన భారంగా వుంది. ఇక పార్టీ ప్రచారం, అలాగే కూటమితో ఉమ్మడిగా చేసే ప్రచారం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బిజెపి నాయకులు తమ అభ్యర్ధులను ప్రకటించే యోచనలో ఉన్నారు. కానీ అసలు బిజెపి నాయకులకు , టీడీపీలో నుంచీ జంప్ అయ్యిన బిజెపి నాయకులకు మధ్య గొడవల నేపథ్యం లో టికెట్ల పంపిణీ అభ్యర్ధుల ప్రకటన ఆలస్యం అవుతుంది. వీరు ప్రచారం అనే ఆలోచన లేదు కానిసం తాము ఎక్కడ పోటి చేస్తున్నామో కూడా తెలియని అయోమయంలో పడ్డారు బిజెపి నాయకులు.