02-డిసెంబర్- 2019న రైల్వేకోడూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన జనసేన సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ఈ నేలని పిరికితనం ఆవహించింది, ఈ పిరికితనం పోగొట్టటానికి ఈ సభకి వచ్చిన అందరూ ఒకేసారి చదువుకొనేంత పెద్ద గ్రంధాలయం కట్టి మీ అజ్ఞానాన్ని, మీలోని పిరికితనాన్ని పారద్రోలి మీలో ధైర్యం నింపుతానని వాగ్ధానం చేశారు.
ఇది జరిగి నాలుగేళ్ల ఒక నెల అయ్యింది. మళ్ళీ ఈ రోజు వరకూ ఆ గ్రంధాలయం స్థాపించే దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు సేనాని . సరికదా గత ఏడాది పవన్ కడప పర్యటన సభ సందర్భంగా రైల్వేకోడూరులో గ్రంధాలయానికి శంఖస్తాపన చేయనున్నారని కొందరు జనసైనికులు ప్రచారం చేయగా అదంతా అసత్యమని పవన్ కళ్యాణ్ గ్రంధాలయం ఏదీ నిర్మించట్లేదని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఇలా వ్యక్తిగతంగా తానిచ్చిన మాట పై కూడా నిలవని పవన్ కళ్యాణ్ 2014 లో టీడీపీ మేనిఫెస్టోకి, బిజెపి ఇచ్చిన ప్రత్యేక హోదాకి కూడా తనదే పూచి అని ప్రకటించి ప్రజల మద్దతు కోరాడు. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపితో మళ్ళీ జట్టు కట్టాడు. అంతటితో ఆగకుండా 650 హామీల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని దారుణంగా వంచించిన చంద్రబాబు పంచన మళ్ళీ చేరి టీడీపీ -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటూ అలవిగాని హామీల వరద కురిపిస్తున్నారు .
ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువని అపార నమ్మకం అనుకొంటా బాబూ, పవన్ లకి .